Telangana : గుడ్‌న్యూస్‌.. మరో రెండు గ్యారంటీల అమలు తేదీ ఖ‌రారు..!

Advertisement
Published by
Advertisement

Telangana : గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క తో కలిసి కేబినేట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు శ్రీ వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలుగా గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ రెండు పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు.

Advertisement

రెండు గ్యారంటీలు 27 లేదా 29వ తేదీన ప్రారంభం

ప్రజా పాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా.. ఏజెన్సీలకు చెల్లించాలా..? అందుకు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లయిస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారుడు రూ.500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్నిఅనుసరించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంట వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.అనుమానాలు అపోహాలకు తావు లేకుండా గృహ జ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు.

Advertisement

ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే.. సవరించుకునే అవకాశమివ్వాలని సీఎం సూచించారు. విద్యుత్తు బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలా విద్యుత్తు శాఖ తగినంత ప్రచారం కూడా చేపట్టాలన్నారు. తప్పులను సవరించుకున్నఅర్హులందరికీ తదుపరి నెల నుంచి ఈ పథకం వర్తింపజేయాలని చెప్పారు.అర్హులందరికీ ఈ పథకంలో లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం స్పష్టం చేశారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారుంటే ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణ రావు, సివిల్ సప్లయిస్ కమిషనర్ శ్రీ డీఎస్ చౌహన్, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ శ్రీ రిజ్వీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Recent Posts

Murder Mystery After 40 Years : 40 ఏళ్ల క్రితం చేసిన నేరం.. చేసిన ప‌నికి మనశ్శాంతి లేక చివ‌రి అత‌ను ఏం చేశాడంటే..?

Murder Mystery After 40 Years : కొన్ని నేరాలు కాలగర్భంలో కలిసిపోతాయని అనుకుంటారు. కానీ మనసులోని పాపభీతి మాత్రం…

38 minutes ago

Free Railways Ticket : గుడ్‌న్యూస్‌.. వీళ్ల‌కు రైల్లో ఉచిత ప్ర‌యాణం.. రైల్వే కీలక నిబంధనలు ఇవే..!

Free Railways Ticket  : భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు…

2 hours ago

Students Free Bus Passes : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. విద్యార్థుల‌కు ఉచిత బ‌స్‌పాస్‌ ఇవ్వ‌నున్న ప్ర‌భుత్వం..!

Students Free Bus Passes : విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం అందించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం…

3 hours ago

300 Units Free Electricity : కేంద్ర ప్రభుత్వ బంపర్ ఆఫర్… నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్..!

300 Units Free Electricity : విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలని భావిస్తున్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన PM…

4 hours ago

Hai Jawani Toh Ishq Hona Hai Movie Review : హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Hai Jawani Toh Ishq Hona Hai Movie Review  : బాలీవుడ్ స్టార్ Varun Dhawan హీరోగా, Mrunal…

5 hours ago

Rythu Bharosa : రైతుల‌కు గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుద‌ల‌కు రంగం సిద్ధం..!

Rythu Bharosa : తెలంగాణ Telangana రైతులకు Farmers ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రైతు భరోసా పథకం…

6 hours ago

Upasana Peddi : ‘పెద్ది’ 100 కోట్ల సంబరాలు.. ఫ్యాన్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసిన ఉపాసన.. వీడియో..!

Upasana Peddi  : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ…

6 hours ago

World Environment Day : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా KBR పార్క్ కోసం భారీ వాక్.. ప్రకృతి పరిరక్షణకు యువ‌త పిలుపు

World Environment Day : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ హరిత ప్రాంతమైన KBR నేషనల్ పార్క్…

7 hours ago

Thread Pochampally : నేతన్నల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు.. ‘థ్రెడ్ పోచంపల్లి’ ప్రారంభం..!

Thread Pochampally : తెలంగాణ చేనేత కళకు మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు నేతన్నల జీవనోపాధిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో…

8 hours ago

Uppal MMC Office : ఉప్పల్ MMC ఏర్పాటు చరిత్రాత్మక నిర్ణయం.. కార్యాలయ నిర్మాణ స్థ‌లాన్ని పరిశీలించిన మందుముల పరమేశ్వర్ రెడ్డి..!

Uppal MMC Office  : హైదరాబాద్ నగర అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కీలక చర్యల్లో మల్కాజిగిరి మున్సిపల్…

8 hours ago

Guava Farming Success Story : ఉద్యోగాల కంటే వ్యవసాయమే బెస్ట్.. జామ తోటతో కోటీశ్వరుడైన యువ రైతు స‌క్సెస్ స్టోరీ..!

Guava Farming Success Story : ప్రస్తుతం చాలా మంది యువత ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాల…

10 hours ago

Liquor Prices : మద్యం ప్రియులకు భారీ షాక్.. లిక్కర్, బీర్ రేట్ల భారీగా పెంపు..?

Liquor Prices : తెలంగాణలో మద్యం సేవించే వారికి త్వరలోనే భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో లిక్కర్,…

11 hours ago