Telangana : గుడ్‌న్యూస్‌.. మరో రెండు గ్యారంటీల అమలు తేదీ ఖ‌రారు..!

Advertisement
Published by
Advertisement

Telangana : గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క తో కలిసి కేబినేట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు శ్రీ వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలుగా గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ రెండు పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు.

Advertisement

రెండు గ్యారంటీలు 27 లేదా 29వ తేదీన ప్రారంభం

ప్రజా పాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా.. ఏజెన్సీలకు చెల్లించాలా..? అందుకు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లయిస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారుడు రూ.500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్నిఅనుసరించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంట వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.అనుమానాలు అపోహాలకు తావు లేకుండా గృహ జ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు.

Advertisement

ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే.. సవరించుకునే అవకాశమివ్వాలని సీఎం సూచించారు. విద్యుత్తు బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలా విద్యుత్తు శాఖ తగినంత ప్రచారం కూడా చేపట్టాలన్నారు. తప్పులను సవరించుకున్నఅర్హులందరికీ తదుపరి నెల నుంచి ఈ పథకం వర్తింపజేయాలని చెప్పారు.అర్హులందరికీ ఈ పథకంలో లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం స్పష్టం చేశారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారుంటే ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణ రావు, సివిల్ సప్లయిస్ కమిషనర్ శ్రీ డీఎస్ చౌహన్, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ శ్రీ రిజ్వీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Recent Posts

Ys Jagan : హుటాహుటిన లండన్ బయలుదేరిన జగన్ .. విచిత్రమైన కారణం..!

Ys Jagan  : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…

1 hour ago

Telangana BJP : తెలంగాణలో బీజేపీ దెబ్బతినడానికి ఇదే అతిపెద్ద కారణం..!

Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…

3 hours ago

Mahasena Rajesh : మహాసేన రాజేష్ సంచలన నిర్ణయం !

Mahasena Rajesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మహాసేన రాజేష్. సోషల్ మీడియాలో తనదైన…

4 hours ago

Modi : బిల్లు విషయం లో మోడీ ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అయ్యింది , లోక్ సభ లో అట్టర్ ఫ్లాప్..!

Modi  : మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం…

6 hours ago

Viral video : బుల్లితెరపై కొత్త వినోద వేదిక .. మాజీ మంత్రి ముందే ప్రోమోలో రొమాన్స్ .. !

Viral video : తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రేక్షకులను అలరించేందుకు ఛానెళ్లు కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు వస్తున్నాయి. కామెడీ, కుకింగ్,…

7 hours ago

Dwakra Group : డ్వాక్రా మహిళలకు తీపి కబురు .. ఆ సమస్యలకు చెక్ .. ఇక పై 72 గంటల్లోనే అకౌంట్‌లో డబ్బులు .!

Dwakra Group : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలను అమలు…

10 hours ago

Red Banana : ఎర్రటి అరటి పండు ఎప్పుడైనా తిన్నారా? .. కనబడితే వెంటనే కొనేయండి .. ఎందుకంటే.?

Red Banana : అరటిపండు అనేది ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ పండు అయినప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణంగా…

12 hours ago

Fast Eating : ఫాస్ట్ గా తింటున్నారా? .. ఇక మీ ప్రాణాలు .. బీ కేర్ ఫుల్ ..!

Fast Eating : నేటి వేగవంతమైన జీవనశైలిలో మనుషులు ప్రతి పనినీ త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ తొందరలో…

13 hours ago

Nails : జాగ్రత్త.. గోళ్లపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? .. అయితే మీకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టే..!

Nails : ఉపిరితిత్తుల క్యాన్సర్‌ను సాధారణంగా దగ్గు, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాల ద్వారా గుర్తిస్తారని మనం…

15 hours ago

Pakistan : పైకి బిల్డప్ , తెర వెనక ముష్టి ఎత్తుకుంటూ దొరికిపోయిన పాకిస్తాన్..!

Pakistan : పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. బయటకి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం చిల్లి గవ్వ…

23 hours ago

Mahila Reservation Bill : లోక్‌సభలో కేంద్రానికి షాక్‌ .. వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

Mahila Reservation Bill : మూడింట రెండొంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోవడం Lok Sabha : లోక్‌సభలో కేంద్ర…

1 day ago

Iran Usa : యుద్ధం మధ్యలో అసలైన శత్రువు రంగంలోకి దిగాడు .. భారీ ట్విస్ట్

Iran Usa : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఒక షాకింగ్ నివేదిక బయటకు వచ్చింది. ఇరాన్ మరియు…

1 day ago