
Rythu Bharosa : మీకు రైతు భరోసా నిధులు జమ కాలేదా?... అయితే ఈ పని చేయండి?.. ఏం చేయాలంటే..?
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం telangana government రైతులకు farmars ఆర్థిక భరోసా కల్పించే దిశగా రైతు భరోసా పథకం Rythu Bharosa Funds నిధులను విడుదల చేసింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న రైతులకు ఈ నిర్ణయం ఊరటను కలిగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CM Revanth reddy ఈ నిధులను అధికారికంగా విడుదల చేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో దశల వారీగా డబ్బులు జమ అవుతాయని ప్రకటించారు. మొదటి విడతలో ప్రతి రైతుకు ఒక ఎకరానికి రూ.6,000 చొప్పున జమ చేయగా మిగతా ఎకరాలకు సంబంధించిన మొత్తాన్ని రెండో, మూడో విడతల్లో చెల్లించనున్నట్లు తెలిపారు.
Rythu Bharosa : మీకు రైతు భరోసా నిధులు జమ కాలేదా?… అయితే ఈ పని చేయండి?.. ఏం చేయాలంటే..?
ప్రభుత్వం నిధులను విడుదల చేసినప్పటికీ ఆదివారం బ్యాంకులకు సెలవు ఉండటంతో రైతుల ఖాతాల్లో నగదు సోమవారం నుంచే జమ అవుతోంది. దీనితో కొంతమంది రైతులు తమ ఖాతాల్లో డబ్బులు ఇంకా జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకింగ్ ప్రక్రియ పూర్తవగానే మొత్తాలు ఖాతాల్లో ప్రతిబింబిస్తాయని స్పష్టం చేస్తున్నారు.
తొలి విడతలో డబ్బులు జమ కాని రైతులు కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలించుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ముందుగా తమ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో ధృవీకరించుకోవాలి. అలాగే బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉందా, కేవైసీ ప్రక్రియ పూర్తి అయ్యిందా అనే అంశాలను పరిశీలించాలి. అదనంగా ధరణి పోర్టల్లో పాస్బుక్ వివరాలు సరిగ్గా నమోదయ్యాయా లేదా అన్నది కూడా చెక్ చేయాలి. ఈ వివరాలు సక్రమంగా ఉంటేనే నిధులు ఖాతాలో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. సమస్యలు ఉంటే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఇకపోతే కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు సమయానికి రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవడం అత్యంత కీలకం. గడువు దాటితే నిధులు అందకపోవచ్చని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అలాగే ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు తప్పనిసరి చేయడంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఏదైనా సాంకేతిక సమస్యల వల్ల డబ్బులు జమ కాకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మొదటి ఎకరానికి రూ.6,000 చొప్పున అందజేస్తుండగా ఎన్ని ఎకరాలు ఉన్నా మిగతా మొత్తాన్ని తరువాతి విడతల్లో పూర్తిగా జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతు భరోసా నిధులు అందని వారు తప్పనిసరిగా అధికారులను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది.
Ravi Babu Razor Movie Review : రవిబాబు అనగానే మనకు గుర్తొచ్చేది విభిన్నమైన కెమెరా యాంగిల్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే…
TVK, DMK AIADMK : తమిళనాడు రాజకీయ చరిత్ర ఎప్పుడూ రెండు ధ్రువాల చుట్టూనే తిరుగుతుంది. ఒకటి కరుణానిధి వారసత్వంగా…
Rice vs Chapati : మన దైనందిన జీవితంలో శక్తినిచ్చే ప్రధాన వనరులు కార్బోహైడ్రేట్లు. ఇవి అన్నం మరియు చపాతీ…
Headless Hen : సాధారణంగా ఏ జీవికైనా తల తెగిపోతే కొన్ని సెకన్లలోనో లేదా నిమిషాల్లోనో ప్రాణాలు పోతాయి. గిలగిల…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. కానీ, ఐపీఎల్ 2026లో గురువారం…
Green Tea : నేటి ఆధునిక జీవనశైలిలో 'హెల్త్ ఈజ్ వెల్త్' అనేది కేవలం సామెత మాత్రమే కాదు, అందరి…
Chicken Mutton : మధుమేహం (Diabetes) ఉన్నవారు తమ దైనందిన ఆహారం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కెర…
Hibiscus Flower : సాధారణంగా మన ఇంటి పెరట్లో రంగురంగుల మందార పువ్వులు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని…
Tea : భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. ఉదయాన్నే నిద్రలేవగానే…
Crimes : ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. కోపం, పగ, అనుమానం వంటి కారణాలతో సన్నిహితులనే…
TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళగ…
IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత రసవత్తర దశకు చేరుకుంది. మొత్తం 48 లీగ్…
This website uses cookies.