
Rythu Bharosa : మీకు రైతు భరోసా నిధులు జమ కాలేదా?... అయితే ఈ పని చేయండి?.. ఏం చేయాలంటే..?
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం telangana government రైతులకు farmars ఆర్థిక భరోసా కల్పించే దిశగా రైతు భరోసా పథకం Rythu Bharosa Funds నిధులను విడుదల చేసింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న రైతులకు ఈ నిర్ణయం ఊరటను కలిగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CM Revanth reddy ఈ నిధులను అధికారికంగా విడుదల చేస్తూ అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో దశల వారీగా డబ్బులు జమ అవుతాయని ప్రకటించారు. మొదటి విడతలో ప్రతి రైతుకు ఒక ఎకరానికి రూ.6,000 చొప్పున జమ చేయగా మిగతా ఎకరాలకు సంబంధించిన మొత్తాన్ని రెండో, మూడో విడతల్లో చెల్లించనున్నట్లు తెలిపారు.
Rythu Bharosa : మీకు రైతు భరోసా నిధులు జమ కాలేదా?… అయితే ఈ పని చేయండి?.. ఏం చేయాలంటే..?
ప్రభుత్వం నిధులను విడుదల చేసినప్పటికీ ఆదివారం బ్యాంకులకు సెలవు ఉండటంతో రైతుల ఖాతాల్లో నగదు సోమవారం నుంచే జమ అవుతోంది. దీనితో కొంతమంది రైతులు తమ ఖాతాల్లో డబ్బులు ఇంకా జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకింగ్ ప్రక్రియ పూర్తవగానే మొత్తాలు ఖాతాల్లో ప్రతిబింబిస్తాయని స్పష్టం చేస్తున్నారు.
తొలి విడతలో డబ్బులు జమ కాని రైతులు కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలించుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ముందుగా తమ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో ధృవీకరించుకోవాలి. అలాగే బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉందా, కేవైసీ ప్రక్రియ పూర్తి అయ్యిందా అనే అంశాలను పరిశీలించాలి. అదనంగా ధరణి పోర్టల్లో పాస్బుక్ వివరాలు సరిగ్గా నమోదయ్యాయా లేదా అన్నది కూడా చెక్ చేయాలి. ఈ వివరాలు సక్రమంగా ఉంటేనే నిధులు ఖాతాలో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. సమస్యలు ఉంటే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఇకపోతే కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు సమయానికి రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవడం అత్యంత కీలకం. గడువు దాటితే నిధులు అందకపోవచ్చని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అలాగే ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు తప్పనిసరి చేయడంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఏదైనా సాంకేతిక సమస్యల వల్ల డబ్బులు జమ కాకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మొదటి ఎకరానికి రూ.6,000 చొప్పున అందజేస్తుండగా ఎన్ని ఎకరాలు ఉన్నా మిగతా మొత్తాన్ని తరువాతి విడతల్లో పూర్తిగా జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతు భరోసా నిధులు అందని వారు తప్పనిసరిగా అధికారులను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది.
Gas cylinders : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారింది. గ్యాస్ కోసం ప్రజలు…
Revanth Reddy : తెలంగాణ telangana capital రాజధాని హైదరాబాద్ Hyderabad నగరవాసుల రవాణా కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్…
Dhurandhar 2 : TTN EXCLUSIVE ANALYSIS : బాలీవుడ్ సినిమాలు గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సైన్యాన్ని మరియు…
Vivo X300 Pro 5G : స్మార్ట్ఫోన్ ప్రపంచంలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటూ, వివో తన కొత్త ఫ్లాగ్షిప్…
Gold Silver Rate Today on 24th march 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న పసిడి…
Karthika Deepam 2 March 24th Episode : స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’…
Amla : ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ రోజుల్లో చాలా మంది తమ ఉదయాన్ని ఉసిరి రసంతో ప్రారంభించడం అలవాటుగా…
Health Tips : ఇప్పటి జీవనశైలిలో ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. డయాబెటిస్,…
Chanakya Niti : ప్రాచీన భారతదేశానికి చెందిన గొప్ప మేధావి ఆచార్య చాణక్యుడు మన జీవితాన్ని సుఖంగా, సమతుల్యంగా ఎలా…
Mallareddy : తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన స్టైల్తో వార్తల్లో నిలిచే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి…
Ajit Doval : భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు అమెరికా రాయబారి సెర్గియో గోర్ మధ్య…
RK Roja vs YS Jagan : రోజా ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.…
This website uses cookies.