Categories: NewsTelangana

Jagadish Reddy : పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నారు – కాంగ్రెస్ నేతలపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం

Jagadish Reddy : కేసీఆర్ హరితహారం ద్వారా రాష్ట్రాన్ని పచ్చదనంతో ముంచెత్తినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం హరిత సంహారం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని, విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తోందని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతున్నప్పటికీ, కాంగ్రెస్-బీజేపీ కలిసి నాటకం ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములను రాత్రివేళ ఆక్రమించడానికి ప్రయత్నిస్తోందని, విద్యార్థుల నిరసనలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

Jagadish Reddy : పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నారు – కాంగ్రెస్ నేతలపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం

Jagadish Reddy పేమెంట్ మీద పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే – మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

400 ఎకరాల భూమి విషయంలో కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయని, ప్రభుత్వ పెద్దల కోణం ఇందులో దాగి ఉందని ఆరోపించారు. ఐటీ పార్కుల అభివృద్ధికి భూమి ఉందని, మరి సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెట్టగలరు? అని ప్రశ్నించారు. విద్యార్థుల పోరాటానికి లక్షల మంది మద్దతు తెలపడంతో, దాన్ని పేయిడ్ ప్రచారంగా చిత్రీకరించడం కాంగ్రెస్ తీరును తెలియజేస్తుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తెచ్చిన నిధులను కమీషన్ల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. హెచ్‌సీయూ లో జరుగుతున్న మారణకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మద్దతు కోరడం విద్యార్థుల తప్పేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల హక్కులను హరిస్తూ, ప్రజలను మోసం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ఎక్కడా కోర్టు తీర్పులను అవమానించలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కించపరుస్తోందని విమర్శించారు.

Recent Posts

BRS | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్థ వైఖరి.. ఓటింగ్‌కు దూరంగా ఉండేలా నిర్ణయం?

BRS | రాబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) BRS కీలక నిర్ణయం తీసుకున్నట్లు…

42 minutes ago

Health Tips : అన్నం తిన్న తర్వాత ఈ ఒక్క పని చేస్తే చాలు.. జీర్ణ సమస్యలు, గ్యాస్, మలబద్ధకం అన్నీ ఔట్!

Health Tips : ఈ మోడరన్ లైఫ్‌స్టైల్‌లో ఎక్కువమంది జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అన్నం తిన్న వెంటనే అజీర్ణం,…

2 hours ago

chia seeds | చియా గింజలు ఆరోగ్యానికి మంచివే కానీ.. ఇలా తింటే ప్రమాదమే అంటున్న నిపుణులు!

chia seeds |  ఆధునిక ఆరోగ్య ఆహారాల్లో ప్రముఖంగా ప్రాచుర్యంలోకి వచ్చిన చియా గింజలు (Chia Seeds) నిజంగా పోషక…

3 hours ago

Manila tamarind | సీమ చింతకాయ ఆరోగ్యానికి వరం.. ఇందులోని ఔషధ గుణాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!

Manila tamarind | మనకు సుపరిచితమైన సీమ చింతకాయ (Velvet Tamarind) ఇప్పుడు సూపర్ ఫుడ్స్ జాబితాలోకి చేరుతోంది. చిన్నచిన్న నల్లని…

4 hours ago

Honey | తేనెతో చర్మానికి అద్భుత లాభాలు.. ప్రతి రోజు ముఖానికి అప్లై చేస్తే ఏం జ‌రుగుతుంది అంటే..!

Honey | ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతిసిద్ధమైన పదార్థాల్లో తేనె (Honey) అగ్రస్థానం లో ఉంటుంది. తియ్యటి రుచి కలిగి…

5 hours ago

Cauliflower | కాలీఫ్లవర్‌ను వీళ్లు అస్స‌లు తినకూడదు.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక

Cauliflower |కాలీఫ్లవర్‌ను చాలా మంది ఆరోగ్యకరమైన కూరగాయగా పరిగణించి తరచూ తినే అలవాటు కలిగి ఉంటారు. ఇందులో విటమిన్ సి,…

6 hours ago

Neem tree | ఇంటి దక్షిణంలో వేప చెట్టు నాటండి.. శని దోషాలు తగ్గి, ఆరోగ్య పరిరక్షణ పొందండి!

Neem tree | ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్య పరంగా, జ్యోతిషశాస్త్ర పరంగా ఎంతో ప్రత్యేకత కలిగిన వేప చెట్టు గురించి…

7 hours ago

Rajagopal : అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాడుతా – కోమటిరెడ్డి రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…

16 hours ago