Jupally Krishna Rao : తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఎన్నికల హడావుడి మొదలైంది. ఇంకా నెల రోజుల సమయమే ఉండటంతో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ సందర్భంలోనే కొందరు నేతలు వేరే పార్టీలకు జంప్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అనుకున్న చోట టికెట్ రాకపోతే, అసలు టికెటే రాకపోతే ఏమాత్రం ఆలోచించకుండా వేరే పార్టీలోకి వెళ్తున్నారు. అక్కడ టికెట్ హామీ వస్తే చాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేరే పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్ఎస్, బీజేపీని వీడారు. ఎక్కువగా ఈ పార్టీల నుంచే కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పార్టీ డౌన్ ఫాల్ అయింది. అసలు ఒకప్పుడు బీజేపీలో ఉన్న చరిష్మా ఇప్పుడు లేదు. బీజేపీలోకి వలస నాయకులు రావడంతో పాటు బండి సంజయ్ ని తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో బీజేపీ పార్టీ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది.
ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ ను డీకొట్టే సత్తా ఉన్న పార్టీ బీజేపీనే అని అంతా అనుకున్నారు. కానీ.. సడెన్ గా ఏమైందో తెలియదు.. బీజేపీ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అసలు బీజేపీ పార్టీ గెలవడం పక్కన పెడితే కనీసం ఒక 10 సీట్లు అయినా సాధిస్తుందా అన్న పొజిషన్ కు చేరుకుంది. దీంతో బీజేపీలో చేరిన ఇతర పార్టీల నాయకులు మళ్లీ వేరే పార్టీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ చేరి హుజురాబాద్ నుంచి మళ్లీ ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో చేరారు. విజయశాంతి, వివేక్ లాంటి కీలక నేతలు కూడా బీజేపీలో చేరడంతో బీజేపీకి ఒక్కసారిగా బలం పెరిగింది. కానీ.. వీళ్లంతా ఆ పార్టీలో చేరిన తర్వాతనే పార్టీలో కొత్తగా గొడవలు మొదలయ్యాయి. పార్టీ పరిస్థితి కూడా దారుణంగా పడిపోవడంతో వేరే పార్టీల నాయకులు కూడా బీజేపీని కాదని కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ లోని కీలక నేతలు కూడా బీజేపీలో కాకుండా కాంగ్రెస్ లో చేరారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీలోకి వలస వచ్చిన నాయకులంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన నేతలు కూడా ఈటల పార్టీలోకి వస్తారనే భావిస్తున్నారు. కానీ.. ఈటల పార్టీలోకి రావడం రాకపోవడం అనేది ఆయన ఇష్టం అన్నట్టుగా కొందరు మాట్లాడుతున్నారు. ఈటల పార్టీ మార్పుపై స్పందించిన జూపల్లి కృష్ణారావు.. కాంగ్రెస్ లో చేరడం, చేరకపోవడం అనేది ఈటలకు సంబంధించిన విషయం అని చెప్పుకొచ్చారు. చూడాలి మరి.. ఇప్పటికే బీజేపీ నుంచి ఈటలకు టికెట్ కూడా లభించింది. అయినా కూడా ఈటల.. కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.