Kavitha : ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. మంగళవారం సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆమెకు తాత్కలిక ఉపశమనం లభించింది. ఈ వార్తలతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకుని సంబరాలు జరుపుకున్నారు.జస్టిస్ బిఆర్ గవాయ్ మరియు జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం, బిఆర్ఎస్ మహిళా నేతకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మహిళకు బెయిల్ మంజూరు చేయడం సాధారణ ఆచారం అని గమనించి, సంబంధిత సెక్షన్లను ఉటంకిస్తూ తీర్పును వెలువరించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ప్రమేయం ఉందని పేర్కొంటు మార్చిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కవితను అరెస్టు చేసింది. అప్పటినుంచి ఆమె ఐదు నెలలకు పైగా జైలు జీవితం గడిపారు. ఒక నెల తర్వాత సీబీఐ కూడా అదే కేసులో ఆమెపై కేసు పెట్టింది.జైలులో ఉన్న సమయంలో ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. రెండుసార్లు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కవిత ఇప్పటికే ఐదు నెలల పాటు జైలు జీవితం గడపడం కూడా ఆమెకు బెయిల్ రావడానికి దోహదపడింది. ఐదు నెలల జైలు శిక్షను కూడా న్యాయమూర్తులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ విచారణ ఎప్పుడైనా పూర్తికాదని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
భారత మాజీ అటార్నీ జనరల్, ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ కల్వకుంట్ల కవిత తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. పలు విచారణల అనంతరం ఆమె బెయిల్ లభించింది.కవితకు బెయిల్ రావడంతో ముకుల్ రోహత్గీ గురించి మరోసారి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. రోహిత్గీ ముంబైలోని ప్రభుత్వ లా కాలేజీలో ఎల్.ఎల్.బీ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీ హైకోర్టులో యోగేష్ కుమార్ సబర్వాల్ దగ్గర ప్రాక్టీస్ మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలో లాయర్ వసుధను వివాహం చేసుకున్నారు. వీరికి నిఖిల్ రోగత్గీ, సమీర్ రోహత్గీ ఇద్దరు కుమారులున్నారు. ముకుల్ రోహత్గీ 2014 నుంచి 2017 వరకూ భారత అటార్నీ జనరల్ గా పని చేశారు. ట్రిపుల్ తలాక్, మణిపూర్ నకిలీ ఎన్ కౌంటర్ కేసు, ఆధార్ వంటి పలు విజయవంతమైన కేసులను ఆయన వాదించారు.
దేశవ్యాప్తంగా హై ప్రొఫైల్ కేసులే ముకుల్ రోహత్గీ వాదిస్తారని పేరుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై జైల్లో ఉన్నప్పుడు బెయిల్ తెప్పించిందీ రోహిత్గీనే. జగన్ కు బెయిల్ వచ్చేలా వాదించినవారిలో రాం జఠ్మలానీ తర్వాత ముకుల్ రోహత్గీదే కీలక పాత్ర. ఈయన గంటకు సుమారు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు వరకూ ఫీజు తీసుకుంటారని సమాచారం. అది కూడా కేసు తీవ్రతను బట్టీ మారుతూ ఉంటుందంటారు. అంటే కవిత బెయిల్ విషయంలో ఆయన నిమిషానికి రూ.17 వేల చొప్పున ఫీజు వసూలు చేశారన్నమాట.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.