kcr ktr mahadharna
KCR : వడ్ల కొనుగోలు విషయమై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. వడ్ల కొనుగోలు విషయంలో స్పష్టతనివ్వాలని గురువారం టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేంద్రంపైన నిప్పులు చెరిగారు.
KCR : దేశ రైతుల తరఫున టీఆర్ఎస్ పోరాడుతుందన్న కేసీఆర్..
గురువారం రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కేంద్రం వడ్ల కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ‘మహా ధర్నా’ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో నిర్వహిస్తున్న ‘మహా ధర్నా’ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. కేంద్రం రైతుల పట్ల వ్యతిరేకత చూపుతున్నదని, కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగినట్లు స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం ఇది ప్రారంభం మాత్రమేనని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో కొన్నట్లు ఇక్కడ కూడా వరి ధాన్యం కొనాలని తాను స్వయంగా కేంద్రాన్ని కోరినట్లు గుర్తుచేశారు. ప్రధాని మోడీకి ఈ విషయమై లెటర్ రాసినప్పటకీ స్పందన లేదని విమర్శించారు. ఈ పోరాటం ఈ రోజుతో ఆగేది కాదని, కేంద్రం దిగొచ్చి రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
kcr ktr mahadharna
ఉద్యమం ఉధృతమై ఉప్పెనోలే మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వముందని, ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వడ్లు కొంటారా లేదా అనే ప్రశ్నకు కేంద్రం వద్ద సమాధానం లేదని, అది చెప్పకుండా వంకర టింకరగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వడ్ల కొనుగోలు విషయంలో మూడు రోజుల్లో కేంద్రం నుంచి ప్రకటన రాకపోతే యుద్ధం మొదలు పెడతామని కేసీఆర్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే దేశంలో నాలుగు లక్షల మెగా వాట్ల విద్యుత్ అందుబాటులో ఉన్నదని, దాంతో 24 గంటల కరెంట్ దేశం మొత్తం ఇవ్వొచ్చని, అలా ఇచ్చినప్పటికీ ఇంకా 2 లక్షల మెగా వాట్ల విద్యుత్ మిగులుగా ఉంటుందని వివరించారు. ఈ విషయం దేశమంతా చెప్పాల్సిన అవసరముందని కేసీఆర్ తెలిపారు.
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.