KTR : పెడితే గిడితే 15 రోజులు జైలులో పెడతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు.. కేటీఆర్ సంచ‌ల‌న‌ కామెంట్స్.. వీడియో !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KTR : పెడితే గిడితే 15 రోజులు జైలులో పెడతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు.. కేటీఆర్ సంచ‌ల‌న‌ కామెంట్స్.. వీడియో !!

 Authored By ramu | The Telugu News | Updated on :16 June 2025,8:30 pm

ప్రధానాంశాలు:

  •  KTR : పెడితే గిడితే 15 రోజులు జైలులో పెడతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు.. కేటీఆర్ సంచ‌ల‌న‌ కామెంట్స్

KTR  : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ అనంతరం మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఈ కార్ రేస్ కేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కోరితే పారిపోయారని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినందుకే తనపై తప్పుడు కేసులు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు.

KTR పెడితే గిడితే 15 రోజులు జైలులో పెడతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు కేటీఆర్ సంచ‌ల‌న‌ కామెంట్స్

KTR : పెడితే గిడితే 15 రోజులు జైలులో పెడతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు.. కేటీఆర్ సంచ‌ల‌న‌ కామెంట్స్

KTR  సంచ‌ల‌న కామెంట్స్

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తాను తప్పు చేయలేదని కేటీఆర్ అన్నారు. ఈ ఫార్ములా కేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదన్నారు.‘నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మధ్య చర్చిద్దామని అసెంబ్లీలో అడిగితే రేవంత్ రెడ్డి పారిపోయారు. లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని అన్నప్పటికీ పత్తా లేరు. మళ్లీ విచారణకు పిలిచినా చట్టంపై గౌరవంతో వెళ్లాను. ఉదయం నుంచీ ఒకటే ప్రశ్న తిప్పి తిప్పి అడిగారు.

ఒక్కపైసా కూడా అవినీతి జరగలేదు. అవినీతి ఎక్కడుందని ఏసీబీ అధికారులను అడిగాను. పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలు తప్ప విచారణలో ఏమీ లేదు. పరిపాలన చేయకాదు, హామీలు నెరవేర్చే దమ్ము లేదు. చేతకాని రాజకీయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెడితే గిడితే 15 రోజులు జైలులో పెడతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు.. లొట్టపీసు ముఖ్యమంత్రి భయపడేవాడు ఎవడు లేడు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి.. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదువులు కొన్న వాడు ఎవడు లేడు అంటూ దారుణ‌మైన కామెంట్స్ చేశారు కేటీఆర్..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది