
KTR : పాదయాత్ర పాతదైంది.. కొత్తగా ఆలోచించు కేటీఆర్..!
KTR : రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే పాదయాత్రలు చేసి ప్రజలకి దగ్గరై విజయాలు సాధించిన వారు చాలా మందే ఉన్నారు.పాదయాత్ర.. ఇది పాదాలతో చేసే యాత్ర. అప్పుడెప్పుడో వైఎస్ షర్మిల చేసిన ఈ కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. చాలామంది ఈ పాదయాత్ర ఫార్ములాని వాడేశారు. కానీ, సరైన టైమ్లో వాడి సక్సెస్ అయినవాళ్లు కొందరే. పాదయాత్ర చేద్దాం అని అనుకుంటే సరిపోదు. దానికి అన్ని రకాల తోడ్పాటు, సరైన సమయం ఉండాలి. మాజీ మంత్రి కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో, ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది.
దగ్గరలో ఎన్నికలు లేవు. ఇలాంటి సమయంలో ఈ డెసిషన్కు కారణం ఏమై ఉంటుందనే ప్రశ్న చుట్టూ అనేక డౌట్స్ తెరపైకి వస్తున్నాయి.క్యాడర్ కోరిందా లేక కేటీఆర్ కి ఈ ఆలోచన వచ్చినా అది చాలా పాతబడిపోయిన రాజకీయ ప్రయోగం అని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే తెలంగాణా అస్తవ్యస్తం అయింది అని కేటీఆర్ అంటున్నారు. ప్రజల తరఫున తాము పోరాటాలు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా పాదయాత్ర అంటున్నారు. దయాత్ర ప్రకటనలు చేసిన కేటీఆర్, రేవంత్ రెడ్డి పాదయాత్రలు కాదు మోకాళ్ల యాత్రలు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఇద్దరు నాయకులపై ఆయన విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డివన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలేనని వ్యాఖ్యానించారు. దీపావళి దాటినా రాజకీయ బాంబులు పేల్చలేదేం? అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు రెండూ ఒక్కటేనని.. దొందూ దొందేనని తెలిపారు.
KTR : పాదయాత్ర పాతదైంది.. కొత్తగా ఆలోచించు కేటీఆర్..!
కేసీఆర్ బహుశా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలకు గుడ్ బై చెప్తారనే ప్రచారం జరుగుతోంది. కేవలం, పరోక్ష సహకారం మాత్రమే అందిస్తారని అంటున్నారు. దీనిపై చర్చ జరిగాకే కేటీఆర్ పాదయాత్ర ప్రకటన చేసి ఉంటారని తెగ మాట్లాడుకుంటున్నారు. అంటే, నెక్ట్స్ తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అనేలా ఫోకస్ అయ్యేందుకు పాదయాత్ర దోహదపడుతుందని, కారు పార్టీ మొత్తం తన గ్రిప్లోకి వస్తుందని భావించే పాదాల యాత్రకు దిగుతున్నారని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతోంది. 2027లో జమిలీ ఎన్నికలు ఉండొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఎంత వీలుంటే అంత త్వరగా పాదయాత్ర మొదలుపెట్టి, పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని కేటీఆర్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
This website uses cookies.