Categories: NewsTelanganaTrending

Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖ Vs బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి… లైవ్ లోనే తిట్టుకున్నారు ..!!

Advertisement
Published by
Advertisement

Minister Konda Surekha : ప్రతిపక్ష పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలను అధికార కార్యక్రమాలకు పిలవకుండా కాంగ్రెస్ నాయకులు పిలుస్తున్నారు అనే విషయం పైన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర వాదోపవాదనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి ఆలయ జాతరకు సంబంధించి సమీక్ష సమావేశంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కొమురవెల్లి ఆలయం జనగాం నియోజకవర్గ పరిధిలోకి వస్తున్నందున అధికారులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ సమావేశానికి అతిధులుగా ఆహ్వానించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. మంత్రి కొండా సురేఖ ప్రతాపరెడ్డిని స్టేజి మీదకి ఆహ్వానించడంతో అది నచ్చని రాజేశ్వర్ రెడ్డి కి మంత్రి కొండా సురేఖకి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.

Advertisement

ఎటువంటి అధికార పదవులు లేని వ్యక్తిని స్టేజి మీదకి ఎలా పిలుస్తారు అని రాజేశ్వర్ రెడ్డి మంత్రిని నిలదీశారు. అలా పిలవడం పూర్తిగా ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుందని రాజేశ్వర్ రెడ్డి వాదించారు. అయినా మంత్రి సురేఖ మాత్రం తనకు మంత్రిగా ప్రత్యేక అతిధులను పిలుచుకునే అధికారం ఉంటుంది అన్నారు. అక్కడే ఉన్న సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని చూపిస్తూ కలెక్టర్ గారికి లేని అభ్యంతరం తనకు ఎందుకని రాజేశ్వర్ రెడ్డిని మంత్రి సురేఖ ఎదురు ప్రశ్నించారు. మీకు అసలు సమీక్ష సమావేశం జరగాలని ఉందా లేదా అని మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్టు అధికార సమీక్ష సమావేశాలు పెట్టుకుంటే, తాను అందులో పాల్గొనలేనని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తనకు ఇష్టం ఉంటే ఉండాలని లేకుంటే వెళ్లొచ్చు అని మంత్రి సమాధానం ఇచ్చారు.

Advertisement

అయినా గుడి దగ్గర పెట్టాల్సిన సమావేశాన్ని సిద్దిపేటలో ఉన్న హరిత హోటల్ లో ఏర్పాటు చేయడమేంటని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. సంప్రదాయాలకు, ఆచారాలకు వ్యతిరేకం మల్లన్న జాతరపై సిద్దిపేటలో సమావేశం పెట్టడం ఏంటని పల్లా ప్రశ్నించారు. శ్రీ మల్లికార్జున స్వామి గుడిలో దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు సమావేశం హోటల్ లో పెట్టలేదని, ఈ సమావేశాన్ని తాను బహిష్కరించాలని అన్నారు. తర్వాత ఆ సమావేశం నుండి వాక్ అవుట్ చేశారు. ఇక ఇదంతా జరుగుతున్న కలెక్టర్ కానీ మిగతా అధికారులు కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. కొమ్ము ప్రతాపరెడ్డి కూడా డయాస్ మీటింగ్ మీద నుంచి దిగకుండా సమావేశం ముగిసే వరకు ఉన్నారు.

 

Advertisement

Recent Posts

Union Cabinet Expansion : మోదీ 3.0లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?.. కొత్త వారికి చాన్స్ ఉందా..?

Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…

7 minutes ago

Peddi Movie : భారీ అంచనాల మధ్య ‘పెద్ది’కి కొత్త సమస్యలు.. ఏమవుతుందో?

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…

1 hour ago

Pawan Kalyan : మాస్టర్ ప్లాన్.. ఏడాది ముందే రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్..!

Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…

2 hours ago

OTT Movie : ప్రేమ, సస్పెన్స్, ట్విస్టులతో అదిరిపోయిన సినిమా.. OTTలో వైరల్ అవుతున్న థ్రిల్లర్ మూవీ..!

OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…

3 hours ago

Ganugabanda : గానుగబండ.. పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీలే పునాది.. తల్లిదండ్రులకు టీచర్ల పిలుపు

Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…

3 hours ago

After : భర్తను చంపి ప్రియుడితో జీవితం.. చివరకు అదే ప్రియుడి చేతిలో మహిళ హత్య

After  : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…

4 hours ago

Cooking Oil : వంట నూనె కూడా ఎక్స్‌పైరీ అవుతుందా? చెడిపోయిందో లేదో ఇలా గుర్తించండి

Cooking Oil  : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…

6 hours ago

Jeera Water : వేసవిలో పురుషులకు వరం.. జీలకర్ర నీళ్లు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…

7 hours ago

Free Bus : ఉచిత బస్సు ప్రయాణీకులకు మరో గుడ్‌న్యూస్‌..!

Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…

23 hours ago

IPL 2026 విజేత ఎవ‌రో తేలిపోయింది.. AI ప్రిడిక్షన్ వైరల్..!

IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్‌లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…

1 day ago

Farmers : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేవంత్ సర్కార్ నుంచి నేరుగా డబ్బుల జమ..!

Farmers  : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…

1 day ago

White Guava vs Red Guava : తెల్ల జామా? ఎర్ర జామా? షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్..?

White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…

1 day ago