Alla Ramakrishna Reddy : ఆళ్ల రామకృష్ణారెడ్డి వై.యస్.జగన్మోహన్ రెడ్డి మీద ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఇదే ..??

Alla Ramakrishna Reddy : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేసి కోర్టుకు వెళతానని అంటున్నారు. నారా లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద లీగల్ గా కోర్టులో ఎలా పోరాటం చేసానో అలాగే వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి పై కూడా కేసు పెట్టి న్యాయస్థానానికి తీసుకెళ్తానని అంటున్నారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి తో, వైయస్ ఫ్యామిలీతో అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద సంచలనంగా మారింది. ఇటీవల ఆయన వై.యస్ షర్మిలను కలిశారు. ఆమె పార్టీకి సపోర్ట్ చేస్తానని కూడా చెప్పారు. మంగళగిరిలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం ఫండ్స్ రిలీజ్ చేయలేదని, తాను అప్పులు తీసుకొచ్చి మరి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ఆళ్ల రామకృష్ణారెడ్డి షాక్ ఇచ్చారు.

సొంత అధికారపక్షంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఇది చేయలేదని చెప్పారు. ఇది వైసీపీ ప్రభుత్వానికి అవమానకరం. దీనిపై వైసీపీకి ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జ్ గంజి చిరంజీవి ప్రెస్ మీట్ పెడతారా, ఆయన చెప్పింది అబద్ధమని చెబుతారా లేక ఆయన కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి పై యుద్ధం ప్రకటిస్తారా అనేది చూడాలి. వై.యస్.జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్లు తన దృష్టికి వస్తే తాను కూడా వై.యస్.జగన్మోహన్ రెడ్డి మీద లోకేష్, చంద్రబాబు మీద పోరాడినట్లు లీగల్గా వెళతానని చెప్పారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంగళగిరి తో పాటు కొన్ని నియోజకవర్గాలకి ఫండ్స్ ఇవ్వలేదని, చాలామంది ఎమ్మెల్యేలు సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకొని అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉందని ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే ఆయన వై.యస్.షర్మిలను చూసి ఇలా మాట్లాడారా లేక ప్రజల బలాన్ని చూసుకొని మాట్లాడారా అనేది ఆసక్తికరంగా మారింది. సొంత పార్టీ అభ్యర్థి వై.యస్.జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో నిజంగానే మంగళగిరి నియోజకవర్గానికి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఫండ్స్ ఇవ్వలేదా అని జనాలు చర్చించుకుంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతానని అనడం ఆసక్తికరంగా మారింది. నిజంగా ఆయన తప్పు చేసినట్లు తెలిస్తే పూర్తి ఆధారాలతో సుప్రీంకోర్టు, హైకోర్టులో లీగల్ కేసు వేస్తానని అన్నారు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో మారాయి.

Recent Posts

Men : కేవలం పురుషులకే ఈ పండు… వీరు తింటే మస్తు మంచిదట… నిపుణులు ఏమంటున్నారో తెలుసా…?

Men: ఈ పండుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ పండు పేరు అంజీర్. ఈ పండు…

4 hours ago

PM Kisan : పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్..!

PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధి (PM Kisan) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది…

5 hours ago

గుడ్‌న్యూస్‌.. హెచ్‌ఐవీ (HIV) వైరస్‌ కు చెక్ పెట్టె ఇంజెక్షన్ ను కనుగొన్నారు..!

HIV : ప్రపంచవ్యాప్తంగా మానవాళిని వేధిస్తున్న హెచ్‌ఐవీ (HIV) వైరస్‌ను నివారించడంలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. అమెరికా ఫుడ్…

6 hours ago

New Sim Card Rules : సిమ్ కార్డ్ కొత్త రూల్స్.. ఇవి పాటించ‌కుంటే అంతే..!

New Sim Card Rules : ఇకపై విచ్చలవిడిగా సిమ్ కార్డులు తీసుకునేందుకు అనుమతి లేదు. అంతేకాదు ఒకరి ఐడీ…

7 hours ago

Annadata Sukhibhava Scheme : అన్న‌దాత సుఖీభ‌వ ప‌థకం.. వ‌చ్చాయా.. లేదా ఇలా చెక్ చేసుకోండి..!

Annadata Sukhibhava Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతోంది.…

8 hours ago

Samantha : డైరెక్టర్ భార్య మరో ఇంట్రస్టింగ్ పోస్ట్.. ఇది కూడా సమంత పైనేనా..?

Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత - బాలీవుడ్‌ దర్శకుడు రాజు నిడుమోరుతో ప్రేమలో ఉందన్న వార్తలు సినీ వర్గాల్లో…

9 hours ago

PMEGP : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 25 లక్ష‌లు ఇవ్వ‌నున్న మోదీ..!

PMEGP  : ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ (PMEGP) దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కేంద్ర…

10 hours ago

Green Leafs Vegetables : ఈ ఆకులు చూడడానికి చిన్నగా ఉన్నా… దీని మేలు ఎంతో పెద్దది… ఒక్కసారి తిన్నారంటే షాకే..?

Green Leafs Vegetables : ప్రతిరోజు మీరు తినే ఆహారాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారంటే,మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాంటి…

11 hours ago