Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖ Vs బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి… లైవ్ లోనే తిట్టుకున్నారు ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖ Vs బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి… లైవ్ లోనే తిట్టుకున్నారు ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :31 December 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖ Vs బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి... లైవ్ లోనే తిట్టుకున్నారు ..!!

Minister Konda Surekha : ప్రతిపక్ష పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలను అధికార కార్యక్రమాలకు పిలవకుండా కాంగ్రెస్ నాయకులు పిలుస్తున్నారు అనే విషయం పైన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర వాదోపవాదనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి ఆలయ జాతరకు సంబంధించి సమీక్ష సమావేశంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కొమురవెల్లి ఆలయం జనగాం నియోజకవర్గ పరిధిలోకి వస్తున్నందున అధికారులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ సమావేశానికి అతిధులుగా ఆహ్వానించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. మంత్రి కొండా సురేఖ ప్రతాపరెడ్డిని స్టేజి మీదకి ఆహ్వానించడంతో అది నచ్చని రాజేశ్వర్ రెడ్డి కి మంత్రి కొండా సురేఖకి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.

ఎటువంటి అధికార పదవులు లేని వ్యక్తిని స్టేజి మీదకి ఎలా పిలుస్తారు అని రాజేశ్వర్ రెడ్డి మంత్రిని నిలదీశారు. అలా పిలవడం పూర్తిగా ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుందని రాజేశ్వర్ రెడ్డి వాదించారు. అయినా మంత్రి సురేఖ మాత్రం తనకు మంత్రిగా ప్రత్యేక అతిధులను పిలుచుకునే అధికారం ఉంటుంది అన్నారు. అక్కడే ఉన్న సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని చూపిస్తూ కలెక్టర్ గారికి లేని అభ్యంతరం తనకు ఎందుకని రాజేశ్వర్ రెడ్డిని మంత్రి సురేఖ ఎదురు ప్రశ్నించారు. మీకు అసలు సమీక్ష సమావేశం జరగాలని ఉందా లేదా అని మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్టు అధికార సమీక్ష సమావేశాలు పెట్టుకుంటే, తాను అందులో పాల్గొనలేనని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తనకు ఇష్టం ఉంటే ఉండాలని లేకుంటే వెళ్లొచ్చు అని మంత్రి సమాధానం ఇచ్చారు.

అయినా గుడి దగ్గర పెట్టాల్సిన సమావేశాన్ని సిద్దిపేటలో ఉన్న హరిత హోటల్ లో ఏర్పాటు చేయడమేంటని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. సంప్రదాయాలకు, ఆచారాలకు వ్యతిరేకం మల్లన్న జాతరపై సిద్దిపేటలో సమావేశం పెట్టడం ఏంటని పల్లా ప్రశ్నించారు. శ్రీ మల్లికార్జున స్వామి గుడిలో దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు సమావేశం హోటల్ లో పెట్టలేదని, ఈ సమావేశాన్ని తాను బహిష్కరించాలని అన్నారు. తర్వాత ఆ సమావేశం నుండి వాక్ అవుట్ చేశారు. ఇక ఇదంతా జరుగుతున్న కలెక్టర్ కానీ మిగతా అధికారులు కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. కొమ్ము ప్రతాపరెడ్డి కూడా డయాస్ మీటింగ్ మీద నుంచి దిగకుండా సమావేశం ముగిసే వరకు ఉన్నారు.

 

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి