
#image_title
Minister Seethakka : గురువారం నాడు గాంధీభవన్లో కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఫ్యూడల్ పార్టీ అని, అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బతకలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మాది గడీల పాలన కాదని, గల్లీ బిడ్డల పాలన అని, మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు చూసి బీఆర్ఎస్ నేతలు భయపడి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు అందజేస్తుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇది తట్టుకోలేని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్పై దుష్ప్రచారం చేస్తున్నారు అని సీతక్క వ్యాఖ్యానించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏకకాలంలో రుణమాఫీ అన్నారని, అది ఏమైందని ప్రశ్నించారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోపిడి దొంగలు దోచుకున్నారని, బీఆర్ఎస్ పార్టీ 420 అనే ప్రజలు ఓడగొట్టారు అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కూల్చేస్తాం, పేలుస్తామంటున్నారని మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో వాళ్ళని బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి వాళ్లతో నిరసనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉచిత బస్సు ఆలోచన రాగానే ఆటో డ్రైవర్లతో మొదటగా మాట్లాడిన తర్వాతనే మేనిఫెస్టోలో పెట్టినట్లు చెప్పారు. ఆ పార్టీ దోచుకున్నదంతా బయటకి వస్తుంది అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బడ్జెట్ బారెడు ఖర్చు చారెడు అని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ శ్వేత పత్రంఎక్కడిదని ఎవడు కష్టపడ్డారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు భ్రమ తెలంగాణ చేశారు అని సీతక్క అన్నారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకుంది బీఆర్ఎస్ నాయకులు భారం మోయాల్సింది తెలంగాణ ప్రజల అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు అప్పు చేస్తే తెలంగాణ ఎందుకు సిగ్గుపడాలని మంత్రి సీతక్క నిలదీశారు. బీఆర్ఎస్ బంగారు తెలంగాణ అని పేరు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని అది గ్రహించిన ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టిందని సీతక్క వ్యాఖ్యానించారు.
India vs Pakistan T20 World Cup 2026 : కొలంబో వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా Team…
Keesaragutta : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రి…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాజ్యసభ సీట్ల చుట్టూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత…
Anchor Ravi : బుల్లితెరపై తనదైన మాటకారి తనంతో ప్రేక్షకులను అలరించే యాంకర్ రవి తాజాగా తన వ్యక్తిగత విషయాల…
Ambati Mounika : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు…
Thanuja Emmanuel : జబర్దస్త్ హాస్యనటుడిగా అందరికీ సుపరిచితుడైన ఇమ్మానుయేల్ తాజాగా తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. బిగ్ బాస్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు…
Dietary Guidelines : ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ప్రతి ఐదేళ్లకు…
This website uses cookies.