Categories: NewspoliticsTelangana

Sridhar Babu VS KTR : ధరణి పోర్టల్ అవినీతిపై అసెంబ్లీలో కేటీఆర్‌ను నిలదీసిన కొత్త ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

Advertisement
Advertisement

Sridhar Babu VS KTR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వారం దాటింది. సీఎం రేవంత్ పాలనలో దూసుకుపోతున్నారు. చాలా కొత్తగా, పాత ప్రభుత్వం కంటే కూడా బెటర్ గా రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారు. ఇటీవలే కొత్త ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొత్త స్పీకర్ ను ఎన్నుకున్నారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో కేటీఆర్ పై కొత్త మంత్రులు ఫైర్ అవుతున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని బయటపెడుతున్నారు. తాజాగా కొత్త ఐటీ మంత్రి శ్రీధర్ బాబు.. ధరణి విషయంలో కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. ధరణి మొత్తం తప్పుల తడకే అని మండిపడ్డారు. ధరణికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీ అంశాని చెప్పినప్పుడు ఏమన్నారంటే ఇది సర్వరోగ నివారణి అన్నారు. అన్ని రకాల భూముల సమస్యలను తీర్చుతుందన్నారు. కానీ.. ధరణికి సంబంధించి ఎన్నో సమస్యలు వస్తున్నాయని భూమి యజమానులు వాపోతున్నారన్నారు.

Advertisement

ధరణికి సంబంధించి చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. దీనికి మార్గం లేదు. అధికారుల తప్పిదాలతో భూములు అమ్ముతున్న యాజమానులు పోర్టల్ లో నమోదు చేయబడినా.. వాటిని కొనుగోలు చేసిన వాళ్ల పేర్లు లేవు. చాలా ఏళ్ల కింద కొనుక్కొని సాగు చేసుకుంటున్న వాళ్ల పేర్లు పోర్టల్ లో కనిపించడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు. ధరణి ఆన్ లైన్ లోకి వచ్చిన తర్వాత 4 లక్షల మంది రైతులకు హక్కు పత్రాలు లేవు. మీసేవలో ఆ రైతులు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ అవి పెండింగ్ లో ఉన్నాయి. లాండ్ సీలింగ్ యాక్ట్ లో భూములు పోయినా ఈ రోజు కూడా ధరణి పోర్టల్ లో వాళ్ల పేర్లు కనిపిస్తున్నాయి. దీంతో సాగు చేసుకుంటున్న వాళ్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదని మంత్రి అన్నారు.

Advertisement

Sridhar Babu VS KTR : భూమి కనిపించక నలుగురు రైతులు ఆత్మహత్య

ధరణిలో తమ భూములు కనిపించక నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కేవలం బయటికి వచ్చినవే.. వెలుగులోకి రాని ఆత్మహత్యలు, విషాదాలు చాలా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భూములు అమ్మిన పాత రైతుల పేరు మీద కొత్త పాస్ బుక్స్ జారీ అయ్యాయి. దీన్ని ఆధారంగా చేసుకొని తిరిగి వేరే వాళ్లకు అమ్మేస్తున్నారు. ఇలాంటి తప్పుల తడకగా ఉన్న ధరణి పోర్టల్ మనకు అవసరమా అని మంత్రి మండిపడ్డారు.

Advertisement

Recent Posts

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

33 minutes ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

2 hours ago

Samantha : ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు , సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha  : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…

3 hours ago

MSVPG : వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటున్న చిరు ఫ్యాన్స్ కి బిగ్ బ్యాడ్ న్యూస్

Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…

4 hours ago

Arava Sreedhar : డిల్లీ ని తాకిన జనసేన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం .. బీజేపీ ఆగ్ర‌హం..!

Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…

5 hours ago

Ibomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్

Ibomma Ravi : ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…

5 hours ago

Ajit Pawar : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి

Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ దుర్మరణం చెందారు. బుధవారం…

6 hours ago

Perni Nani : పేర్ని నాని ని అరెస్ట్ చేయబోతున్నారా ?

Perni Nani : గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు మళ్లీ నోటికి పనిచెపుతున్నారు. సీఎం…

7 hours ago