
Vedma Bojju : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రేవంత్ సర్కార్ కు కొత్త తలనొప్పి..!
Vedma Bojju : తెలంగాణ ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఒక కీలక ప్రకటన చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన జీవో 49ను మళ్లీ తీసుకొస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తేల్చిచెప్పారు. గిరిజన హక్కులను ఖాతర చేయకుండా తీసుకొచ్చిన ఆ జీవోను తిరిగి ప్రవేశపెడతారన్న భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా గిరిజనుల హక్కులను కాపాడటం తన బాధ్యతనని, అవసరమైతే త్యాగానికి కూడా వెనుకాడనని అన్నారు.
Vedma Bojju : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రేవంత్ సర్కార్ కు కొత్త తలనొప్పి..!
అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై బొజ్జు తీవ్రంగా స్పందించారు. “అటవీ శాఖ అధికారులు అడవిలో నుంచి కలప తరలింపును నియంత్రించలేకపోతున్నారు. వేలాది రూపాయల విలువైన కలప ఎలా మాయమవుతోంది?” అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులను అటవీ అధికారులు వేధిస్తున్నారని విమర్శించారు. అడవుల్లో గొర్రెలు, బర్రెలతో కాపరిచే గిరిజనులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
పోడు భూముల విషయంలో గిరిజనుల హక్కులను ఖచ్చితంగా రక్షిస్తానని స్పష్టం చేసిన వెడ్మ బొజ్జు, ప్రభుత్వం గిరిజనుల భూములపై దాడులకు పాల్పడితే గిరిజనుల తిరుగుబాటుకు తానే నాయకత్వం వహిస్తానన్నారు. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదని, ప్రజల హక్కుల కోసం జరిగే పోరాటమని చెప్పారు. తన రాజకీయ జీవితం అంతా గిరిజనుల అభ్యున్నతికి అంకితమైందని పేర్కొంటూ, ఈ విషయంలో రాజీ ఉండదని తేల్చి చెప్పారు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.