
nagarjuna sagar dam issue between telangana and ap
Nagarjuan Sagar Dam : ఓవైపు నవంబర్ 30న అంటే నిన్న తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు అక్కడ మోహరించారు. దానికి కారణం ఏంటంటే.. నవంబర్ 30న ఏపీ అధికారులు.. కుడి కాలువ కోసం నీటిని విడుదల చేసుకున్నారు. అవి దాదాపు 4 వేల క్యూసెక్కుల నీళ్లు. అయితే.. సాగర్ లో ప్రస్తుతం ఉన్నది 522 అడుగుల నీటి మట్టం మాత్రమే. ఇంకో 12 అడుగులు తగ్గితే డెడ్ స్టోరేజీకి చేరుతుంది. ఈనేపథ్యంలో ఏపీ అధికారులు నీటి విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. నిజానికి.. బుధవారం అర్ధరాత్రి నుంచే ఈ హైడ్రామా స్టార్ట్ అయింది. ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి డ్యామ్ వద్దకు వచ్చి అక్కడ ఉన్న బారికేడ్లను కూడా తొలగించారు. 13వ గేట్ వద్ద నీటిని విడుదల చేశారు.
దీంతో ప్రశాంతంగా ఇప్పటి వరకు ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ అలజడి స్టార్ట్ అయింది. నాగార్జునసాగర్ డ్యామ్ నీటి కోసం రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ లొల్లి స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. నిజానికి.. 2015 నుంచే నాగార్జున సాగర్ నీటి పంపకాల విషయంలో గొడవ జరుగుతోంది. అప్పటి నుంచి ఈ గొడవ అలాగే ఉండిపోయింది. తాజాగా.. ఏపీ అధికారులు వచ్చి.. నీటిని విడుదల చేసుకోవడం, అలాగే.. కుడిగట్టు క్రస్ట్ గేట్ల స్విచ్ రూమ్ డోర్స్ ను పగులగొట్టడంతో ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
కృష్ణా రివర్ బోర్డ్ ప్రకారం.. 13వ నెంబర్ గేటు తమ పరిధిలో ఉంటుందని ఏపీ చెబుతోంది. అందుకే అక్కడ కంచె ఏర్పాటు చేశామన్నారు. కానీ.. ఆ కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. కానీ.. ఏపీ పోలీసులు.. వాళ్లను అడ్డుకున్నారు. మరోవైపు కుడి కాలువ నుంచి ఏపీకి నీటి విడుదల కూడా కొనసాగుతోంది. దీంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులు సాగర్ డ్యామ్ వద్దకు చేరుకొని డ్యామ్ వద్ద పరిస్థితులను సమీక్షించారు. కేంద్రం కూడా రెండు రాష్ట్రాల జల వివాదంపై స్పందించింది. అక్కడి పరిస్థితులను ఆరా తీస్తోంది.
Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…
Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…
Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్…
Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
This website uses cookies.