Nagarjuan Sagar Dam : ఓవైపు నవంబర్ 30న అంటే నిన్న తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు అక్కడ మోహరించారు. దానికి కారణం ఏంటంటే.. నవంబర్ 30న ఏపీ అధికారులు.. కుడి కాలువ కోసం నీటిని విడుదల చేసుకున్నారు. అవి దాదాపు 4 వేల క్యూసెక్కుల నీళ్లు. అయితే.. సాగర్ లో ప్రస్తుతం ఉన్నది 522 అడుగుల నీటి మట్టం మాత్రమే. ఇంకో 12 అడుగులు తగ్గితే డెడ్ స్టోరేజీకి చేరుతుంది. ఈనేపథ్యంలో ఏపీ అధికారులు నీటి విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. నిజానికి.. బుధవారం అర్ధరాత్రి నుంచే ఈ హైడ్రామా స్టార్ట్ అయింది. ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి డ్యామ్ వద్దకు వచ్చి అక్కడ ఉన్న బారికేడ్లను కూడా తొలగించారు. 13వ గేట్ వద్ద నీటిని విడుదల చేశారు.
దీంతో ప్రశాంతంగా ఇప్పటి వరకు ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ అలజడి స్టార్ట్ అయింది. నాగార్జునసాగర్ డ్యామ్ నీటి కోసం రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ లొల్లి స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. నిజానికి.. 2015 నుంచే నాగార్జున సాగర్ నీటి పంపకాల విషయంలో గొడవ జరుగుతోంది. అప్పటి నుంచి ఈ గొడవ అలాగే ఉండిపోయింది. తాజాగా.. ఏపీ అధికారులు వచ్చి.. నీటిని విడుదల చేసుకోవడం, అలాగే.. కుడిగట్టు క్రస్ట్ గేట్ల స్విచ్ రూమ్ డోర్స్ ను పగులగొట్టడంతో ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
కృష్ణా రివర్ బోర్డ్ ప్రకారం.. 13వ నెంబర్ గేటు తమ పరిధిలో ఉంటుందని ఏపీ చెబుతోంది. అందుకే అక్కడ కంచె ఏర్పాటు చేశామన్నారు. కానీ.. ఆ కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. కానీ.. ఏపీ పోలీసులు.. వాళ్లను అడ్డుకున్నారు. మరోవైపు కుడి కాలువ నుంచి ఏపీకి నీటి విడుదల కూడా కొనసాగుతోంది. దీంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులు సాగర్ డ్యామ్ వద్దకు చేరుకొని డ్యామ్ వద్ద పరిస్థితులను సమీక్షించారు. కేంద్రం కూడా రెండు రాష్ట్రాల జల వివాదంపై స్పందించింది. అక్కడి పరిస్థితులను ఆరా తీస్తోంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.