
Pension : ఏపీలో పెరిగిన పెన్షన్స్.. తెలంగాణలో పెరిగేది ఎప్పుడంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్
Pension : ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు చంద్రబాబు నాయుడు. అధికారికంగా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు వరుసపెట్టి శుభవార్తలు చెబుతున్నారు. అధికారం చేపట్టగానే తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేసిన చంద్రబాబు.. ఆపై పెన్షన్స్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న పెన్షన్ విధానంలో మార్పులు తీసుకొస్తూ పెన్షన్లను భారీగా పెంచేశారు. ఈ మేరకు ఫైల్ పై సంతకం కూడా చేశారు బాబు.2014 -2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా మార్చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చింది.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రస్తుతం రూ.3వేల పెన్షన్ వస్తుండగా.. దాన్ని 4 వేల రూపాయలకు పెంచారు. పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నారు. అంటే ఏప్రిల్, మే, జూన్కు సంబంధించి నెలకు రూ.1000 చొప్పున 3 నెలలకు 3 వేలు అదనంగా కూడా ఇవ్వబోతున్నారు. మరి తెలంగాణలో పెన్షన్ల ఎప్పుడు పెంచుతారని ప్రజలు అడుగుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే 44 లక్షల మంది పింఛనుదారులు ఉండగా.. కొత్త పింఛన్ల కోసం తాజాగా 24.84 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వారికి మోక్షం ఎప్పుడు కలుగుతుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీల్లో భాగంగా సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 ఇస్తామని చెప్పారు. అయితే ఇంత వరకు పెన్షన్ పెంచకపోవడంతో లబోదిబోమంటున్నారు.
Pension : ఏపీలో పెరిగిన పెన్షన్స్.. తెలంగాణలో పెరిగేది ఎప్పుడంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్
ఏపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ పెంచడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి ఎక్కువైంది. త్వరలోనే పెంపు కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇక పెన్షన్ తీసుకుంటున్న వారిలో 70 నుంచి 75 ఏళ్లు పైబడిన వారికి బేసిక్ పెన్షన్ పై 15 శాతం అదనంగా ఇవ్వనున్నారు. అలానే 75 నుంచి 80 ఏళ్ల లోపు వారికి 20శాతంగా నిర్ణయించారు. అదే విధంగా 80 నుంచి 85 ఏళ్ల లోపు వారికి 30శాతం, 90 నుంచి 95 ఏళ్ల లోపు వారికి 50శాతం అదనంగా పెన్షన్ అందించనున్నారు. ఇక 95 నుంచి 100 ఏళ్ల లోపు వారికి 60శాతం, 100ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు, కుటుంబ పెన్షన్దారులకు 100శాతం అదనంగా పెన్షన్ ఇవ్వనుదని సమాచారం
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయడానికి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘రైతు భరోసా’…
Chicken skin : నాన్వెజ్ ప్రియుల్లో చాలామంది చికెన్ను చర్మంతో కలిపి తినడానికి ఆసక్తి చూపుతారు. ప్రత్యేకంగా ఫ్రైడ్ లేదా…
Coconut Water : వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు ఉత్తమమైన సహజ పానీయం. ఇవి దాహాన్ని…
Summer Diet : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం అవసరం అవుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల…
Tamil Nadu Elections : తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని డీఎంకే, ఏఐడీఎంకే…
This website uses cookies.