Categories: NewspoliticsTelangana

CM Revanth Reddy : 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి రివెంజ్..!

Advertisement
Advertisement

CM Revanth Reddy : 2015లో ఓటుకు నోటు వ్యవహారంలో తనని అరెస్టు చేసి జైలుకు పంపించారు. కాని అంతే గొప్పగా బౌన్స్ బ్యాక్ అవుతూ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో తన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఫోన్ టాప్ చేసి ఓటుకు నోటు కేసులో చంద్రబాబును మరియు రేవంత్ రెడ్డిని ఇరికించిన కెసిఆర్ పై దాదాపు పది సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్ రివెంజ్ తీర్చుకోబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు కానీ రాజకీయాలలో ప్రస్తుతం ఇలాంటివి చాలా సర్వసాధారణమైపోయాయి. అయితే ఒకపక్క కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం జరిగింది. మరో పక్క కెసిఆర్ కు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ పై పలు రకాల ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలోనే ఈ ఫోన్ టాపింగ్ కేసు పై ప్రణీత్ రావ్ అనే వ్యక్తి బయటపెట్టిన కొన్ని నిజాలతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు తమ ఫోన్స్ టాప్ అవుతున్నాయనే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకోచ్చారు. మేము ప్రతిపక్షాలతో మాట్లాడే మాటలు కేసీఆర్ వింటున్నాడని చంద్రబాబు తెలియజేశారు. అంతేకాక ఈ మధ్యన జరిగిన ఎలక్షన్స్ ముందు రోజుల్లో కూడా అధికారుల సహాయంతో కెసిఆర్ ప్రతిపక్షాల ఫోన్ టాపింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విధంగా ఫోన్ టాపింగ్ అనేది పలు సందర్భాలలో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు కూడా చేశాయి.

Advertisement

కాని కేసీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల ప్రాంతంలో ఒక పెద్ద సెటప్ పెట్టుకుని చాలామంది ఫోన్ లను టాప్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ప్రణీత్ రావు అనే వ్యక్తికి ఒక గ్యాంగ్ ఉందట. ఇక వారి రోజు చేసే పని అందరి ఫోన్లను ట్యాప్ చేయడమే నట. అయితే వీరు రోజు చేసే పని అ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలను ,అలాగే హీరోయిన్స్ హీరోల ఫోన్లు కూడా టాప్ చేసి వారి పర్సనల్ విషయాలు తెలుసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేయడం. అంతేకాదు పలు సందర్భాల్లో చాలామంది కేసీఆర్ కాలు కూడా పట్టుకున్నారనే ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి. ఈ విధంగా ఫోన్ టాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా లాభాలు పొందారని ఆరోపణలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలపై బీఆర్ఎస్ పార్టీ ఇంకా స్పందించుకోవడం అనేది గమనార్హం.అయితే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఫోన్స్ టాప్ అవుతున్నాయని సంగతి ముందే చెప్పారు .

Advertisement

ఆ తర్వాత ఇదే విషయంపై రేవంత్ రెడ్డి కూడా కొన్నాళ్లు వాదించి తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ ఫోన్ టాపిక్ మాఫియా ఉందో దానిని బయటికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దీనిలో ఎంత పెద్ద తలకాయలు అరెస్టు అవుతాయనేది ఊహించటం చాలా కష్టం. అయితే దీనిలో చాలా పెద్ద పెద్ద వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి . ఇక ఈ ఫోన్ టాపింగ్ మాఫియాలో కేసీఆర్ కేటీఆర్ పేర్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. అయితే అడ్మినిస్ట్రేషన్ లో దొరికిన ప్రతి అధికారి ఎవరి ప్రోత్సాహం వలన ఈ విధంగా చేశారు అనే విషయాలను బయట పెడితే కనుక కచ్చితంగా ఆ నాయకుడికి లేదా ఆ వ్యక్తికి జైలు శిక్ష పడటం అనేది ఖాయమని తెలుస్తోంది. అయితే 10 సంవత్సరాల క్రితం ఫోన్ టాప్ చేసి ఓటుకు నోటు కేసు లో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిన కేసీఆర్ ఇప్పుడు తన కూతురు తీహర్ జైలుకు వెళ్లినా కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా సైలెంట్ గా ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. అయితే ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్ పెట్టే కేసీఆర్ ఈ విషయంపై మాత్రం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదు. అయితే తప్పులు జరిగితేనే వ్యక్తులు సైలెంట్ గా ఉంటారని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ ఫోన్ టాపింగ్ కేసులో కచ్చితంగా పెద్ద రాజకీయ నాయకులు అరెస్ట్ అవుతారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పగ తీరబోతుందంటూ పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Recent Posts

iPhone 15 : ఐఫోన్ కొనాలనే కోరిక ఉన్న ధర ఎక్కువని కొనలేకపోతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్

iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…

22 minutes ago

Pawan Kalyan : రాజకీయ నాయకుల కోసం ప్రజలను ఇబ్బంది పెడతారా అంటూ పవన్ హీరోయిన్ ఆగ్రహం

Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…

1 hour ago

Nara Lokesh : యాక్షన్ కు సిద్దమైన నారా లోకేష్.. వణికిపోతున్న సొంత పార్టీ నేతలు

Nara Lokesh  : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…

2 hours ago

Eating : భోజనం చేయగానే ఆ పని అస్సలు చేయకూడదు..!

Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…

3 hours ago

Udyogini Scheme : మహిళల కోసం ‘ఉద్యోగిని పథకం 2026’ ను తీసుకొచ్చిన కర్ణాటక ప్రభుత్వం, దీనికి ఎలా అప్లయ్ చేయాలంటే !!

Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…

4 hours ago

NIT Warangal Recruitment 2026: నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త..NIT లో పెద్ద ఎత్తున జాబ్స్ మీరు అప్లై చేసుకోవడమే ఆలస్యం !1

NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…

5 hours ago

Today Gold Rate January 14 : నేటి గోల్డ్ & వెండి ధరలు ఎలా ఉన్నాయంటే !!

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…

7 hours ago

Mutton : సంక్రాంతి పండుగ వేళ మీరు మటన్ కొనేటప్పుడు.. ఇవి గమనించలేదో అంతే సంగతి..!

Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…

7 hours ago