
CM Revanth Reddy : 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి రివెంజ్..!
CM Revanth Reddy : 2015లో ఓటుకు నోటు వ్యవహారంలో తనని అరెస్టు చేసి జైలుకు పంపించారు. కాని అంతే గొప్పగా బౌన్స్ బ్యాక్ అవుతూ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో తన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఫోన్ టాప్ చేసి ఓటుకు నోటు కేసులో చంద్రబాబును మరియు రేవంత్ రెడ్డిని ఇరికించిన కెసిఆర్ పై దాదాపు పది సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్ రివెంజ్ తీర్చుకోబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు కానీ రాజకీయాలలో ప్రస్తుతం ఇలాంటివి చాలా సర్వసాధారణమైపోయాయి. అయితే ఒకపక్క కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం జరిగింది. మరో పక్క కెసిఆర్ కు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ పై పలు రకాల ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలోనే ఈ ఫోన్ టాపింగ్ కేసు పై ప్రణీత్ రావ్ అనే వ్యక్తి బయటపెట్టిన కొన్ని నిజాలతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు తమ ఫోన్స్ టాప్ అవుతున్నాయనే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకోచ్చారు. మేము ప్రతిపక్షాలతో మాట్లాడే మాటలు కేసీఆర్ వింటున్నాడని చంద్రబాబు తెలియజేశారు. అంతేకాక ఈ మధ్యన జరిగిన ఎలక్షన్స్ ముందు రోజుల్లో కూడా అధికారుల సహాయంతో కెసిఆర్ ప్రతిపక్షాల ఫోన్ టాపింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విధంగా ఫోన్ టాపింగ్ అనేది పలు సందర్భాలలో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు కూడా చేశాయి.
కాని కేసీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల ప్రాంతంలో ఒక పెద్ద సెటప్ పెట్టుకుని చాలామంది ఫోన్ లను టాప్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ప్రణీత్ రావు అనే వ్యక్తికి ఒక గ్యాంగ్ ఉందట. ఇక వారి రోజు చేసే పని అందరి ఫోన్లను ట్యాప్ చేయడమే నట. అయితే వీరు రోజు చేసే పని అ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలను ,అలాగే హీరోయిన్స్ హీరోల ఫోన్లు కూడా టాప్ చేసి వారి పర్సనల్ విషయాలు తెలుసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేయడం. అంతేకాదు పలు సందర్భాల్లో చాలామంది కేసీఆర్ కాలు కూడా పట్టుకున్నారనే ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి. ఈ విధంగా ఫోన్ టాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా లాభాలు పొందారని ఆరోపణలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలపై బీఆర్ఎస్ పార్టీ ఇంకా స్పందించుకోవడం అనేది గమనార్హం.అయితే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఫోన్స్ టాప్ అవుతున్నాయని సంగతి ముందే చెప్పారు .
ఆ తర్వాత ఇదే విషయంపై రేవంత్ రెడ్డి కూడా కొన్నాళ్లు వాదించి తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ ఫోన్ టాపిక్ మాఫియా ఉందో దానిని బయటికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దీనిలో ఎంత పెద్ద తలకాయలు అరెస్టు అవుతాయనేది ఊహించటం చాలా కష్టం. అయితే దీనిలో చాలా పెద్ద పెద్ద వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి . ఇక ఈ ఫోన్ టాపింగ్ మాఫియాలో కేసీఆర్ కేటీఆర్ పేర్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. అయితే అడ్మినిస్ట్రేషన్ లో దొరికిన ప్రతి అధికారి ఎవరి ప్రోత్సాహం వలన ఈ విధంగా చేశారు అనే విషయాలను బయట పెడితే కనుక కచ్చితంగా ఆ నాయకుడికి లేదా ఆ వ్యక్తికి జైలు శిక్ష పడటం అనేది ఖాయమని తెలుస్తోంది. అయితే 10 సంవత్సరాల క్రితం ఫోన్ టాప్ చేసి ఓటుకు నోటు కేసు లో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిన కేసీఆర్ ఇప్పుడు తన కూతురు తీహర్ జైలుకు వెళ్లినా కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా సైలెంట్ గా ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. అయితే ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్ పెట్టే కేసీఆర్ ఈ విషయంపై మాత్రం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదు. అయితే తప్పులు జరిగితేనే వ్యక్తులు సైలెంట్ గా ఉంటారని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ ఫోన్ టాపింగ్ కేసులో కచ్చితంగా పెద్ద రాజకీయ నాయకులు అరెస్ట్ అవుతారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పగ తీరబోతుందంటూ పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
This website uses cookies.