Rajagopal Reddy : ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు , నల్గొండకు ముగ్గురు ఉండకూడదా..? - రాజగోపాల్
Rajagopal Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కని సీనియర్ నాయకులలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. తనకు మంత్రి పదవి దక్కకపోవడం తో ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవులు ఇవ్వడం కుదరడం లేదని కాంగ్రెస్ అగ్ర నేతలు చేస్తున్న కామెంట్స్ పై రాజగోపాల్ రియాక్ట్ అయ్యారు. “నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడే, మేమిద్దరం అన్నదమ్ములమని తెలియదా?” అని ప్రశ్నించారు. ఈ పరిస్థితులను ఆయన “ఒడ్డు దాటే వరకు ఓడ మల్లన్న, ఒడ్డు దాటాక బోడి మల్లన్న” చందంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనను, నల్గొండ జిల్లాను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన పరోక్షంగా సూచించారు.
Rajagopal Reddy : ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు , నల్గొండకు ముగ్గురు ఉండకూడదా..? – రాజగోపాల్
9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండటం తప్పా అని సూటిగా ప్రశ్నించారు. తాను తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇద్దరం సమర్థులమే, గట్టివాళ్లమే అని స్పష్టం చేశారు. అయితే పార్టీలో తమను తక్కువ అంచనా వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మంత్రి పదవి కోసమే తాను పార్టీలో చేరలేదని, మునుగోడు ప్రజలకు న్యాయం జరగాలనేదే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే, తన నియోజకవర్గమైన మునుగోడు ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. “నాకు అన్యాయం జరిగినా పర్లేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయవద్దు” అని గత ప్రభుత్వానికి చెప్పానని, ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు అద్దం పడుతున్నాయి. మంత్రి పదవుల విషయంలో ఉన్న అసంతృప్తిని రాజగోపాల్ రెడ్డి బయటపెట్టడంతో, ఇది భవిష్యత్తులో పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Court Heroine Sridevi : ఇన్స్టాగ్రామ్లో తరచూ యాక్టివ్గా ఉండే శ్రీదేవి, ఇటీవల రక్షా బంధన్ సందర్భంగా ఓ వీడియోని…
Good News : ఆంధ్రప్రదేశ్లో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు శుభవార్త. హజ్ యాత్ర 2026 కోసం దరఖాస్తు చేసుకున్న…
Kavitha : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి…
Pulivendula Zptc : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు భారీ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం…
Turmeric Water Bath : స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేశారంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి…
Uppal : ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మందుముల పరమేశ్వర్రెడ్డి mandumula parameshwar reddy, కృషి ఫలించింది. ఫలితంగా…
Today Gold Rates : గత కొంతకాలంగా పరుగులు పెడుతూ రికార్డు స్థాయిలకు చేరిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం…
Mutton Bone Soup : పాతకాలం నుంచి ఇప్పటివరకు కూడా ఎవరికైనా ఎముకలు విరిగిన లేదా కీళ్ల నొప్పులు ఉన్న,మోకాళ్ళ…
This website uses cookies.