Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, ఐటీ డేటాతో అనర్హుల ఏరివేత.. ఆ కార్డులు రద్దు!

 Authored By jagadesh | The Telugu News | Updated on :5 April 2026,8:00 pm

ప్రధానాంశాలు:

  •  రేషన్ కార్డుల ఏరివేత.. అడ్డంగా దొరికిన అనర్హులు

  •  Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, ఐటీ డేటాతో అనర్హుల ఏరివేత.. ఆ కార్డులు రద్దు!

Ration Cards  : తెలంగాణలో అనర్హులైన రేషన్ కార్డుదారులపై ప్రభుత్వాలు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యాయి. నిరుపేదల కోసం ఉద్దేశించిన ఉచిత రేషన్ బియ్యాన్ని, ఇతర సంక్షేమ పథకాలను అక్రమంగా పొందుతున్న వారిని పీఎం కిసాన్ PM Kisan,  ఆదాయ పన్ను Income Tax డేటా ఆధారంగా అధికారులు గుర్తించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కార్డులను తొలగించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది.

Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, ఐటీ డేటాతో అనర్హుల ఏరివేత.. ఆ కార్డులు రద్దు!

Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, ఐటీ డేటాతో అనర్హుల ఏరివేత.. ఆ కార్డులు రద్దు!

Ration Cards  : డేటాలో బయటపడిన సంచలన నిజాలు ఇవే

క్షేత్రస్థాయిలో రేషన్ కార్డుల వినియోగంపై జరిపిన పరిశీలనలో అధికారులనే విస్మయానికి గురిచేసే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా రేషన్ పొందుతుండటం వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.135 కోట్ల మేర గండి పడుతున్నట్లు తేలింది.

చనిపోయిన వారి పేరుతో: రాష్ట్రంలో దాదాపు 83,545 మంది మరణించిన వ్యక్తుల పేర్ల మీద ఇంకా రేషన్ పంపిణీ జరుగుతూనే ఉంది.

ఐటీ చెల్లిస్తూనే ఉచిత రేషన్: పీఎం కిసాన్ డేటా ఆధారంగా.. ఏటా లక్షల రూపాయల ఆదాయ పన్ను IT Returns చెల్లిస్తున్న 52,339 మంది దర్జాగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారు.

భారీగా వ్యవసాయ భూములు: సుమారు 5,866 మందికి 15 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉంది. వీరు రైతు భరోసా/పీఎం కిసాన్ ద్వారా ఏటా రూ.1.50 లక్షల వరకు లబ్ధి పొందుతూనే, మరోవైపు పేదల ముసుగులో రేషన్ తీసుకుంటున్నారు.

కోటీశ్వరులకూ రేషన్ కార్డులు: ఏటా రూ.25 లక్షలకు పైగా ఆదాయం ఉన్న దాదాపు 8 లక్షల కుటుంబాలు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

బ్లాక్ మార్కెట్‌కు రేషన్ బియ్యం.. ఇతర పథకాల దుర్వినియోగం

గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు మాత్రమే రేషన్ కార్డుకు అర్హులు. కానీ, నెలకు లక్ష రూపాయలు సంపాదించే వారు సైతం అధికారులకు ముడుపులు చెల్లించి కార్డులు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. వీరు ఏటా దాదాపు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యాన్ని తీసుకుని నేరుగా బ్లాక్ మార్కెట్ Black Market లో అమ్ముకుంటున్నారు. అంతేకాకుండా ఈ కార్డుల ద్వారా ఆరోగ్యశ్రీ Arogyasri, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర బ్యాంకు రుణాలు సైతం కాజేస్తూ నిజమైన పేదలకు అన్యాయం చేస్తున్నారు.

1.40 లక్షల కార్డుల రద్దుకు రంగం సిద్ధం

అనర్హుల ఏరివేతపై ఇటీవల పార్లమెంటులో కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

కేంద్రం ఇప్పటికే ఈ అనర్హుల జాబితాను తెలంగాణ పౌరసరఫరాల శాఖకు Civil Supplies Department పంపింది. త్వరలోనే జిల్లా స్థాయి అధికారులు రంగంలోకి దిగి, నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. సరైన వివరణ ఇవ్వని పక్షంలో ఆ కార్డులను శాశ్వతంగా రద్దు చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి