
Revanth Reddy : రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం.. తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం..!
Revanth Reddy : రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నదే ప్రజా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలండర్ను ప్రకటించబోతున్నామని చెప్పారు.ప్రతి ఏటా మార్చి 31 లోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించి జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలను ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని సీఎం చెప్పారు.ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం” కార్యక్రమాన్ని సీఎంగారు లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. సింగరేణి సంస్థ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో సివిల్స్లో ప్రిలిమ్స్ సాధించి మెయిన్స్కు ఎంపికైన యువతీ యువకులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు.“నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తుందని ముందు ప్రభుత్వంపై విశ్వాసం, నమ్మకం ఉండాలి.
ఈ ప్రభుత్వం కచ్చితంగా, సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించి సమర్థులైన వారిని ఎంపిక చేస్తుందన్న నమ్మకం రావాలి. ఎంపికలోనూ కచ్చితంగా సామాజిక న్యాయం పాటిస్తుంది. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ, మహిళా రిజర్వేషన్లు పాటిస్తుంది. ఎలాంటి అపనమ్మకాలు అవసరం లేదన్న భావన రావాలి. సంస్థపై నమ్మకం ఉంటే నిరుద్యోగుల ఫోకస్ అంతా ప్రపిరేషన్పై ఉంటుంది” అని ముఖ్యమంత్రి వివరించారు. గ్రూప్ I, II, III, ప్యారా మెడికల్, పోలీస్, డీఎస్సీ, టెట్… ఇలా ఏ పరీక్షలైనా సరైన సమయంలో సమర్థవంతంగా నిర్వహించాలన్నదే ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం చెప్పారు. కష్టపడే విద్యార్థులకు ఈ ప్రభుత్వం భుజం తడుతుందని భరోసానిచ్చారు.
Revanth Reddy : రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం.. తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం..!
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే చిత్తశుద్ధితో 30 వేల ఖాళీలను భర్తీ చేసి నియామక పత్రాలను అందజేసిన విషయాన్ని గుర్తుచేస్తూ దాన్ని బట్టి ప్రభుత్వ ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చని తెలిపారు. నాడు తెలంగాణ అంటే నిరుద్యోగానికి పర్యాయపదంగా ఉండేదని, తెలంగాణ ఏర్పడినప్పుడు 20, 22 ఏళ్ళ వయసున్న యువకులు ఉద్యోగం కోసం గత పదేళ్లలో ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆనాడు జరిగిన అనేక పొరపాట్ల వల్ల ఏ పరీక్షా సమయానికి జరక్క, పరీక్షా పత్రాలు లీకయి పల్లి బఠాణీల్లా మార్కెట్లో దొరకడం వంటి అనేక పరిణామాల వల్ల వారిలో నమ్మకం సన్నగిల్లడమే కాకుండా వారి జీవితంలో పదేళ్ల విలువైన కాలం వృధా అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి UPSC2024 లో విజయం సాధించిన అభ్యర్థులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జ్ఞాపికను అందజేసి అభినందించారు.
TRS : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పాత జెండా పేరు చుట్టూ వేడి చర్చలు మొదలయ్యాయి. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను…
Ajay Ghosh : టాలీవుడ్లో మరోసారి రెమ్యూనరేషన్ అంశం హాట్ టాపిక్గా మారింది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఇటీవల…
Cold Water : వేసవి కాలం మొదలయ్యిందంటే చాలు, చల్లటి నీటి కోసం ప్రతి ఇంటిలో ఫ్రిజ్ తలుపులు ఎక్కువసార్లు…
Paapam Prathap Movie Review in Telugu : టాలీవుడ్లో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన…
Bad Boy Karthik Movie Review in Telugu : టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య Naga Shaurya తన…
Green Tea vs Black Coffee : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం, ఫిట్నెస్పై అవగాహన గణనీయంగా పెరిగింది. బరువు…
Modi : దేశ రాజకీయాల్లో ఇప్పుడు నారీ శక్తి వందన చట్టం సవరణ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విశ్లేషిస్తే వైసీపీ అధినేత జగన్…
Dacoit Movie : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన కెరీర్ లో ఎప్పుడు వైవిధ్యమైన కథలను…
Raghuraama Vs Ramalayam : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రస్తుతం ఒక ఆలయ నిర్మాణం చుట్టూ జరుగుతున్న పరిణామాలు…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్…
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను…
This website uses cookies.