
Revanth Reddy : జగన్ ఫార్ములాతో రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయం.. త్వరలో గ్రామాల్లో కొత్త వ్యవస్థ..!
Revanth Reddy : తెలంగాణలో ఊహించని విధంగా గెలుపొంది ఇప్పుడు అనేక కొత్త కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అసెంబ్లీలో సత్తా చాటిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అదే రిజల్ట్ రిపీట్ చేయాలని భావిస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించటమే కాకుండా, సరికొత్త ఎత్తుగడలు వేస్తూ ఓటర్స్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష సమావేశానికి హాజరైన సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్న వాలంటీర్ల విధానం తరహాలో తెలంగాణలోనూ ఓ కొత్త వ్యవస్థను తీసుకొస్తామని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారడం మనం చూశాం.
ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించటంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు ఏపీలో గెలిచేందుకు ఇటు జగన్, అటు చంద్రబాబు వాలంటీర్లకు హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలకు చేరువ అయిన వాలంటీర్లను ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థకి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు దీనిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత దాదాపు 36,000 మంది వాలంటీర్లను నియమించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ నేతలతో తన ప్రణాళికలను పంచుకున్నట్లు తెలుస్తోంది.
Revanth Reddy : జగన్ ఫార్ములాతో రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయం.. త్వరలో గ్రామాల్లో కొత్త వ్యవస్థ..!
ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణలో అనేక పథకాలు అమలవుతుండగా, ఆ పథకాలని ప్రజలకి మరింత చేరవేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బాగా పనిచేసిన కార్యకర్తలను గుర్తించి.. ఇందిరమ్మ కమిటీల్లో నియమిస్తామని చెప్పారు. వారికి ప్రభుత్వం నుంచి రూ. 6 వేల చొప్పున గౌరవ వేతనం కూడా ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించినట్లు ఓ టాక్ నడుస్తుంది. వాలంటీర్ల నియామకం ఏపీ మాదిరిగా కాకుండా కొంత మార్పుతో అమలు చేయాలని చూస్తున్నారు. వీరు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చేయడమే కాకుండా లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను పంపిణీ చేయడం వంటి బాధ్యతలు కూడా అప్పగించనున్నట్టు సమాచారం.
Viral news : మహాకుంభ్ మేళాలో తీయించుకున్న ఫొటోలతో ఒక్క రాత్రిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయి దేశవ్యాప్తంగా గుర్తింపు…
Hyderabad : హైదరాబాద్లోని వృత్తిదారుల భవనంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కల్లుగీత కార్మిక సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తిరగబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో…
Gold and Silver Rate Today on March 12 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు,…
Karthika Deepam 2 March 12th 2026 Episode : బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న 'కార్తీక దీపం 2' సీరియల్…
Guava Vs Banana : మన శరీరానికి పండ్లు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరాలు. ముఖ్యంగా రాత్రంతా ఆహారం తీసుకోకుండా…
Bottle Gourd Juice : మన రోజువారీ ఆహారంలో ఉపయోగించే కూరగాయలలో సొరకాయ ముఖ్యమైనది. దీనిని చాలాచోట్ల ఆనపకాయ అని…
Trisha Vijay : తమిళ సినీ రంగంలో అగ్ర హీరోగా వెలుగు వెలుగుతున్న దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ…
YS Jagan : ప్రకాశం జిల్లా రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్…
Donald Trump on Iran : అమెరికా అధ్యక్షుడిగా మళ్ళీ పగ్గాలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ కి ఇరాన్ రూపంలో…
Revanth reddy:తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.…
LPG Gas : పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. బాంబుల మోతతో మాత్రమే…
This website uses cookies.