
Revanth Reddy : జగన్ ఫార్ములాతో రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయం.. త్వరలో గ్రామాల్లో కొత్త వ్యవస్థ..!
Revanth Reddy : తెలంగాణలో ఊహించని విధంగా గెలుపొంది ఇప్పుడు అనేక కొత్త కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అసెంబ్లీలో సత్తా చాటిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అదే రిజల్ట్ రిపీట్ చేయాలని భావిస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించటమే కాకుండా, సరికొత్త ఎత్తుగడలు వేస్తూ ఓటర్స్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష సమావేశానికి హాజరైన సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్న వాలంటీర్ల విధానం తరహాలో తెలంగాణలోనూ ఓ కొత్త వ్యవస్థను తీసుకొస్తామని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారడం మనం చూశాం.
ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించటంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు ఏపీలో గెలిచేందుకు ఇటు జగన్, అటు చంద్రబాబు వాలంటీర్లకు హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలకు చేరువ అయిన వాలంటీర్లను ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థకి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు దీనిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత దాదాపు 36,000 మంది వాలంటీర్లను నియమించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ నేతలతో తన ప్రణాళికలను పంచుకున్నట్లు తెలుస్తోంది.
Revanth Reddy : జగన్ ఫార్ములాతో రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయం.. త్వరలో గ్రామాల్లో కొత్త వ్యవస్థ..!
ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణలో అనేక పథకాలు అమలవుతుండగా, ఆ పథకాలని ప్రజలకి మరింత చేరవేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బాగా పనిచేసిన కార్యకర్తలను గుర్తించి.. ఇందిరమ్మ కమిటీల్లో నియమిస్తామని చెప్పారు. వారికి ప్రభుత్వం నుంచి రూ. 6 వేల చొప్పున గౌరవ వేతనం కూడా ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించినట్లు ఓ టాక్ నడుస్తుంది. వాలంటీర్ల నియామకం ఏపీ మాదిరిగా కాకుండా కొంత మార్పుతో అమలు చేయాలని చూస్తున్నారు. వీరు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చేయడమే కాకుండా లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను పంపిణీ చేయడం వంటి బాధ్యతలు కూడా అప్పగించనున్నట్టు సమాచారం.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.