
Revanth Reddy : రేవంత్ రెడ్డి స్కెచ్ మాములుగా లేదు.. హరీష్ తర్వాత టార్గెట్ కేటీఆర్, కేసీఆర్..!
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. గులాబీ పార్టీ గద్దెలు పూర్తిగా కూలాలనీ, ఆ పార్టీని వంద మీటర్ల లోతులో పాతిపెట్టాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ ఆవేశంలో భాగమేనని చాలామంది భావించారు. అయితే ఆ వ్యాఖ్యల వెనుక లోతైన రాజకీయ వ్యూహం, పరిపాలనా చర్యలు ఉన్నాయన్న విషయం ఇప్పుడు స్పష్టమవుతోంది. ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మాట్లాడిన అనంతరం, కేవలం ఒక్కరోజు గ్యాప్లోనే గులాబీ పార్టీకి ఆ పరిణామాల తీవ్రత అర్థమయ్యేలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి సక్రియమై, ఈసారి మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది.
Revanth Reddy : రేవంత్ రెడ్డి స్కెచ్ మాములుగా లేదు.. హరీష్ తర్వాత టార్గెట్ కేటీఆర్, కేసీఆర్..!
సోమవారం రాత్రి సీఆర్పీఎస్ సెక్షన్ 160 కింద జారీ చేసిన ఈ నోటీసుల ప్రకారం, మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి స్వయంగా ఈ నోటీసులను హరీష్ రావుకు అందించారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కూడా తన భర్త ఫోన్ సహా కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభుత్వం దూకుడు పెంచింది. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరు లాభపడ్డారు, నాటి పాలకుల కోసం పనిచేసిన అధికారులు ఎలాంటి ప్రయోజనాలు ఆశించారు అనే అంశాలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందం ముందుకు సాగుతోంది.
హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ కేసులో ముందుగా హరీష్ రావును, ఆ తర్వాత కేటీఆర్ను, అనంతరం కేసీఆర్ను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులను, ఇతరులను విచారించిన సిట్, సేకరించిన సమాచారం ఆధారంగానే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. విచారణలో ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, గతంలోనే తనకు నోటీసులు వస్తాయని హరీష్ రావు వ్యాఖ్యానించిన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ ఎన్నికలకు ముందు ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్కు నోటీసులు ఇచ్చారని, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో తనకు కూడా ఇస్తారని ఆయన అప్పుడే పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రత్యక్ష ప్రమేయం ఉండదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అది జరుగుతుందని కూడా హరీష్ రావు గతంలో వ్యాఖ్యానించారు. అయితే ఈ కేసులో మొదటి నుంచే కేసీఆర్ పేరు వినిపిస్తుండగా, త్వరలోనే ఆయనకు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
Social Media Ban for Children : ఏపీ ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై…
Ration Cards : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం…
Varalaxmi Sarathkumar S Saraswathi Movie Review : నటీనటులు: వరలక్ష్మి శరత్కుమార్, ప్రకాష్ రాజ్, జీవా, ప్రియమణి, రాధిక…
This website uses cookies.