Revanth Reddy : ఓర్నీ ఇదెట్టా.. టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు.. కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : ఓర్నీ ఇదెట్టా.. టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు.. కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 January 2026,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : ఓర్నీ ఇదెట్టా.. టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు.. కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా..!

Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖమ్మం బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకునేలా ఆయన ప్రసంగం సాగింది.ఈ సభలో రేవంత్‌ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై నందమూరి తారక రామారావుకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని, అలాగే నారా చంద్రబాబు నాయుడికి కూడా అనేక మంది అనుచరులు, సహచరులు ఉన్నారని గుర్తు చేశారు. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికిని లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్‌, బీఆర్ఎస్‌ పార్టీ అప్పట్లో తీవ్ర ప్రయత్నాలు చేశాయని విమర్శించారు. టీడీపీని తుడిచిపెట్టేందుకు వారు చేయని ప్రయత్నం లేదని అన్నారు.

Revanth Reddy ఓర్నీ ఇదెట్టా టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా

Revanth Reddy : ఓర్నీ ఇదెట్టా.. టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు.. కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా..!

Revanth Reddy : బీఆర్ఎస్‌పై రేవంత్‌ రెడ్డి విమర్శలు

అంతేకాకుండా, గతంలో పచ్చ జెండాను అణిచివేసిన బీఆర్ఎస్‌ను ఇప్పుడు రాజకీయంగా పూర్తిగా పాతిపెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌ పార్టీ రాజకీయంగా సమాధి అయినప్పుడే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యం నిలవాలంటే అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యల వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమ్మం వంటి జిల్లాల్లో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి గట్టి ఓటు బ్యాంక్ ఉండటంతో, ఆ వర్గాలను కాంగ్రెస్‌ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ప్రసంగం చేసినట్టు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం టీడీపీ నేతలను ఫిరాయింపులకు గురిచేసి పార్టీని బలహీనపరిచిన అంశాన్ని గుర్తుచేస్తూ, బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నింటిని కాంగ్రెస్‌ గొడుగు కిందకు తీసుకురావాలనే సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఈ బహిరంగ సభలో ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ జెండాలు కనిపించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో మారే సమీకరణాలకు సంకేతమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేసీఆర్ పార్టీని రాజకీయంగా బలహీనపరచడమే లక్ష్యంగా రేవంత్‌ రెడ్డి సాగిస్తున్న ఈ దూకుడు రాజకీయాలు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి.

Advertisement

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది