Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇలా చేయడం మంచి నిర్ణ‌య‌మే..!

Advertisement
Advertisement

Revanth Reddy  : తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై జరిగిన భారీ అవినీతికి బీఆర్ఎస్ పార్టీపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై చర్చలు మొదలయ్యాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగం అన్నది మామూలుగా జరగదు. అసాధారణ పరిస్థితిలో మాత్రమే ఈ యాక్ట్ ను గుర్తించిన బాధ్యులపై ప్రభుత్వం ప్రయోగిస్తుంది. అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులో వేలకోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని రేవంత్ రెడ్డి పదేపదే అంటున్నారు. వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసుకోవడం ఒక ఎత్తు అయితే ప్రాజెక్టులను నాసిరకంగా నిర్మించి వృధాగా కోట్ల రూపాయలు తేలుతుంది. దీనిపైన రేవంత్ సర్కార్ మండిపడుతుంది. అయితే ఎవరిపైనా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తారు అన్నది అర్థం కావటం లేదు. ప్రాజెక్టులపై జరిగిన సమీక్షలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంతా కేసీఆర్ పర్యవేక్షణలోనే జరిగిందని అధికారులు చెప్పారు.

Advertisement

ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును తానే డిజైన్ చేసినట్లు గొప్పగా ప్రకటించుకున్నారు. ఇంజనీర్లు ఆర్కిటెక్ట్స్ చేయాల్సిన పనిని కేసీఆర్ ఎలాగ చేశారా అర్థం కావడం లేదు. ఇదే విషయాన్ని అప్పట్లో ప్రతిపక్షాలు అడిగినా కేసీఆర్ సమాధానం ఇవ్వలేదు. పదేళ్లు పాలించి బీఆర్ఎస్ తప్పుకోగానే అప్పట్లో జరిగిన అవినీతి మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ బయటపెడుతుంది. మేడిగడ్డ బ్యారేజీలో నాసిరకం నిర్మాణం రీ డిజైనింగ్ చేయడం ద్వారా వేలకోట్ల రూపాయలు వృధా అయిన కాళేశ్వరం ప్రాజెక్టు టార్గెట్ రీచ్ అవ్వలేదని ప్రభుత్వం చెబుతోంది. 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు లక్ష ఎకరాలకు కూడా నీటిని అందించలేక పోయిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రాజెక్టుపై 98 వేల కోట్లు ఖర్చు అయినట్లు ప్రభుత్వం లెక్కలు తేల్చింది.

Advertisement

అంటే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కనీసం దానివల్ల లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తేలింది. ప్రాజెక్టు వ్యయం పెరిగిపోవడం, సాగునీటి ఆయకట్టుకు నీరు అందకపోవడం మేడిగడ్డ బ్యారేజీలో నాసిరకం నిర్మాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని బాధ్యులను చేయాలి. కేసిఆర్ మొత్తానికి బాధ్యుడు అంటూ రేవంత్ రెడ్డి ఇప్పటికే తేల్చేశారు. కానీ ప్రకటన కార్యరూపంలో వచ్చేటప్పటికి రేవంత్ సర్కార్ తనపైన కక్ష సాధింపులకు దిగుతున్నారని కేసీఆర్ రోడ్డు ఎక్కుతారు. బీఆర్ఎస్ నేతలంతా గోల గోల చేస్తారు. అధికారుల పైన యాక్షన్ తీసుకోవాలంటే మొత్తం కేసీఆర్ చేసినప్పుడు తమ పైన యాక్షన్ ఎలా తీసుకుంటారని కోర్టుకి ఎక్కుతారు. అందుకని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగం సాధ్యమేనా అనే చర్చ పెరిగిపోతుంది.

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

9 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

10 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

12 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

13 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

14 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

17 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

18 hours ago

This website uses cookies.