
Farmers : రైతుల కోసం రేవంత్ సర్కార్ మరో పథకం
Farmers : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే రైతులకు పంట పెట్టుబడి సహాయంగా “రైతు భరోసా” పథకం కింద రూ. 8,744.13 కోట్లను 69.39 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా రికార్డు స్థాయిలో నిధుల పంపిణీ పూర్తి చేసింది. ఇది రాష్ట్రంలో రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో ఓ మైలురాయిగా నిలిచింది.
Farmers : రైతుల కోసం రేవంత్ సర్కార్ మరో పథకం
రైతుల ఆదాయం పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రో ఫారెస్ట్రీ విధానాన్ని ప్రోత్సహించేందుకు ముందడుగు వేసింది. ఈ విధానంలో వ్యవసాయ భూమిలో పంటలతో పాటు వృక్షాలనూ పెంచే అవకాశం ఉంటుంది. దీనివల్ల పంటల ఆదాయం తో పాటు వృక్ష ఉత్పత్తుల ద్వారా అదనంగా సంపాదించవచ్చు. పైగా అడవుల విస్తీర్ణం పెరగడం, వాతావరణానికి హానికలిగించే కాలుష్యాన్ని తగ్గించడం వంటి పర్యావరణ ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు నేషనల్ టింబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది.
రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కూలీలకూ “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకం కింద ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. కౌలు రైతులకు కూడా నిధులు అందించేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఏటా రూ. 12,000 వరకు సాయం అందిస్తామన్న హామీ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక మరోవైపు, రైతుల పొలాల్లో బోర్లకు సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేసి, మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేసే వ్యవస్థను అమలు చేయనుంది. ఇలా సరఫరా చేసిన ప్రతి యూనిట్కు రైతుకు రూ. 3.13 చొప్పున డిస్కమ్ సంస్థలు చెల్లించనున్నాయి. దీంతో రైతులు పంటలతో పాటు సోలార్ ద్వారా కూడా అదనంగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
This website uses cookies.