Farmers : గుడ్న్యూస్.. రైతుల కోసం రేవంత్ సర్కార్ మరో పథకం
ప్రధానాంశాలు:
తెలంగాణ లో ఆగ్రో ఫారెస్ట్రీ విధానాన్ని అమలు చేయబోతున్న రేవంత్ సర్కార్
Farmers : గుడ్న్యూస్.. రైతుల కోసం రేవంత్ సర్కార్ మరో పథకం
Farmers : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే రైతులకు పంట పెట్టుబడి సహాయంగా “రైతు భరోసా” పథకం కింద రూ. 8,744.13 కోట్లను 69.39 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా రికార్డు స్థాయిలో నిధుల పంపిణీ పూర్తి చేసింది. ఇది రాష్ట్రంలో రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో ఓ మైలురాయిగా నిలిచింది.

Farmers : రైతుల కోసం రేవంత్ సర్కార్ మరో పథకం
Farmers : తెలంగాణ లో ఆగ్రో ఫారెస్ట్రీ విధానం.? అసలు ఆగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటి..? దీని వల్ల రైతులకు ఏం ప్రయోజనం..?
రైతుల ఆదాయం పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రో ఫారెస్ట్రీ విధానాన్ని ప్రోత్సహించేందుకు ముందడుగు వేసింది. ఈ విధానంలో వ్యవసాయ భూమిలో పంటలతో పాటు వృక్షాలనూ పెంచే అవకాశం ఉంటుంది. దీనివల్ల పంటల ఆదాయం తో పాటు వృక్ష ఉత్పత్తుల ద్వారా అదనంగా సంపాదించవచ్చు. పైగా అడవుల విస్తీర్ణం పెరగడం, వాతావరణానికి హానికలిగించే కాలుష్యాన్ని తగ్గించడం వంటి పర్యావరణ ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు నేషనల్ టింబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది.
రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కూలీలకూ “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకం కింద ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. కౌలు రైతులకు కూడా నిధులు అందించేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఏటా రూ. 12,000 వరకు సాయం అందిస్తామన్న హామీ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక మరోవైపు, రైతుల పొలాల్లో బోర్లకు సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేసి, మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేసే వ్యవస్థను అమలు చేయనుంది. ఇలా సరఫరా చేసిన ప్రతి యూనిట్కు రైతుకు రూ. 3.13 చొప్పున డిస్కమ్ సంస్థలు చెల్లించనున్నాయి. దీంతో రైతులు పంటలతో పాటు సోలార్ ద్వారా కూడా అదనంగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.