Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. గతంలో అమలు చేసిన రైతు బంధు పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ.10వేలు మాత్రమే చెల్లించేవారు. ఎన్నికల వాగ్ధానం అమలులో భాగంగా దాన్ని మరో రూ.5 వేలు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం త్వరలో విధివిధానాలను రూపొందించి రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది. రైతులకు ఫసల్ బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు ఈ ఏడాది నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రైతుల తరపున ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుంది. అంతే కాకుండా వ్యవసాయ, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం “తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్” ఏర్పాటు చేసింది.
ఈ మేరకు రైతు భరోసాపై కేబినేట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతు భరోసాపై చర్యలు వేగవంతం చేశారు. ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాగు లేని భూములకు రైతు భరోసా లేనట్లే నని ప్రకటించారు. దీంతో ఈ పథకంపై వడివడిగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత యాసంగి పంటకు రైతు బంధు నిధులనే అందించింది. రైతు బంధు పథకంలో లోపాలు ఉన్నాయని, అంతేకాకుండా దానికి పరిమితులు విధించాలని చెప్పారు. ఇందులో భాగంగా ఊరూరా సమావేశాలు నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.
ఈ నేపథ్యంలో రైతు భరోసా ను 5 ఎకరాలకు మాత్రమే పరిమితం చేస్తారని అంటున్నారు. మరికొందరు మాత్రం 10 ఎకరల వరకు ఇవ్వాలని అంటున్నారు. మరో రెండు రోజుల్లో కేబినేట్ మీటింగ్ ఉంటుందని, ఈ సమావేశంలోనే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే కొన్ని వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. వచ్చే దసరా కానుకగా రైతులకు రైతు భరోసా నిధులను అందించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత వానకాలం పంటకే రైతు భరోసా ఇవ్వాలి. కానీ ఆ సమయంలో రైతు రుణ మాఫీ హడావిడి కారణంతో పాటు నిధుల లేమి కారణంగా రైతు భరోసాను వాయిదే వేశారని కొందరు చెబుతున్నారు. కానీ ఇప్పుడు దసరా కానుకగా రైతు భరోసాను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
Eating Snails : నత్తల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. అయితే కొన్నిచోట్ల నత్తల కూరను తినడానికి చాలా…
This website uses cookies.