Sircilla Rajeshwari : ఆమె కష్టాలు, కన్నీళ్లు అక్షరాలుగా మారి.. మహారాష్ట్ర బోర్డులో చోటు సంపాదించి పెట్టాయి

Advertisement
Advertisement

Sircilla Rajeshwari  : బూర రాజేశ్వరి అంటే చాలా మందికి తెలియదు కానీ.. సిరిసిల్లకు వెళ్లి సిరిసిల్ల రాజేశ్వరి అని అడిగితే చాలు.. అందరి చూపు ఆమె వైపే తిరుగుతుంది. ఇంతకీ ఆమె ఎవరు? మహారాష్ట్ర బోర్డులో ఆమెకు ఎలా చోటు దక్కింది. ఆమె జీవితం ఏంటి.. తెలుసుకుందాం పదండి..

Advertisement

Sircilla Rajeswari poems added in second language academic curriculum of maharashtra

బూర రాజేశ్వరి.. రెండు చేతులు పనిచేయవు. పుట్టడమే అలా పుట్టింది ఆమె. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు. మామూలుగా ఉన్నవాళ్లకే బోలెడు కష్టాలు. చేతులు సరిగ్గా లేకుంటే ఇంకెన్ని కష్టాలు ఉంటాయో ఊహించుకోవాల్సిందే. అసలే పేద కుటుంబం. తనకు 15 ఏళ్లు వచ్చే వరకు కూడా సరిగ్గా నడవలేకపోయింది రాజేశ్వరి.

Advertisement

ఆసుపత్రుల్లో చూపించడానికి తల్లిదండ్రేలేమీ ఉన్నోళ్లు కాదు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. వాళ్లు కూడా రాజేశ్వరి తలరాత ఇంతే అని వదిలేశారు. కానీ.. తను మాత్రం తన తలరాతను మార్చుకోవాలనుకున్నది. నిరాశకు గురికాలేదు. చేతులు లేకుంటేనేం.. కాళ్లు ఉన్నాయి కదా.. అని కాళ్లతోనే పెన్ను పట్టింది. ఇంటర్మీడియెట్ వరకు చదివింది.

తన మనసుకు నచ్చింది చేయడం ప్రారంభించింది. కాళ్లతోనే కవితలు రాయడం ప్రారంభించింది. కాళ్లతోనే పెయింటింగ్ వేయడం ప్రారంభించింది. అలా.. తను రాసిన కవితల్లో 800 కవితలను మహారాష్ట్ర బోర్డు తమ అకాడెమిక్ కరిక్యులమ్ లో చేర్చింది. అంటే తను రాసిన కవితలు.. ఎంత దూరం వెళ్లాయో చూడండి.

సిరిసిల్ల నేతన్నల కష్టాలనే కవితలుగా..

సిరిసిల్ల అంటేనే మనకు గుర్తుకు వచ్చేది నేతన్నలు. అవును.. వాళ్ల బాధలు ఇప్పటివి కాదు. నేతన్నల కష్టాలను దగ్గర్నుంచి చూసిన రాజేశ్వరి.. వాళ్ల కష్టాలనే కవితలుగా మార్చింది. తనకు ఎంత ఇష్టమైన సాహిత్యాన్ని ఇలా కవితల రూపంలో బయటపెట్టింది.

తన గురించి తెలుసుకున్న రచయిత సుద్దాల అశోక్ తేజ.. సిరిసిల్ల రాజేశ్వరి కవితలు.. అనే పేరుతో తన కవితలను ప్రచురించారు. అలాగే.. తన గురించి మహారాష్ట్ర బోర్డుకు తెలియడంతో.. మహారాష్ట్రలోని అన్ని కాలేజీల్లో రెండో భాష తెలుగు పుస్తకంలో తన కవితలను పాఠంగా చేర్చి విద్యార్థులకు బోధిస్తున్నారు.

తెలంగాణ బోర్డుకు సిఫార్సు చేసిన కేటీఆర్..

అయితే.. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. సిరిసిల్ల రాజేశ్వరి కవితలను తెలంగాణ బోర్డు అకాడెమిక్ కరిక్యులమ్ లో కూడా చేర్చాలని.. సిరిసిల్ల రాజేశ్వరి కథను విద్యార్థులకు తెలియజేయాలని ఆదేశించారు.

Recent Posts

Union Budget 2026 : అన్నదాతల ఆశలకు కేంద్రం గుడ్ న్యూస్.. 7 సంచలన నిర్ణయాలు..?

Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…

37 minutes ago

Redmi Note 15 Pro 5G : రెడ్మీ నోట్ 15 ప్రో 5జీ.. 29న గ్రాండ్ ఎంట్రీ.. 200 MP కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్స్..

Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్‌ఫోన్ Smart Phone మార్కెట్‌లో మరో హాట్ అప్‌డేట్‌కు…

2 hours ago

Pakistan : టీ20 వరల్డ్ కప్‌పై సస్పెన్స్.. భారత్-పాక్ మ్యాచ్ ఉందా?.. లేదా ?

pakistan : టీ20 వరల్డ్ కప్  india vs pakistan t20 world cup 2026  ప్రారంభానికి ఇంకా రెండు…

3 hours ago

Telangana: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి వివరాలు ఇవే..!

Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…

3 hours ago

Union Budget 2026 : రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. కేంద్ర బడ్జెట్ లో కొత్తగా మరో పథకం..!

Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…

4 hours ago

Survey : ఏపీ లో సంచలనం సృష్టిస్తున్న సర్వే .. ఆ ప్రాంతంలో క్లీన్ స్వీప్ చెయ్యబోతున్న వైసీపీ

Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…

5 hours ago

Bank Holidays : వరుసగా మూడో రోజు మూతపడ్డ బ్యాంకులు.. ఎందుకో తెలుసా?

Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…

6 hours ago

Vizianagaram: రూ.400 కోసం వృద్ధుడి ప్రాణం తీసిన కిరాతకుడు : మానవత్వాన్ని కలిచివేసిన ఘటన

Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…

6 hours ago