
Telangana Assembly Budget 2024 : రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మాకు ఇచ్చారు.. బీఆర్ఎస్ పై గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు..!
Telangana Assembly Budget 2024 : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ బీఆర్ఎస్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళోజీ కవితతో గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కంచెను తొలగించామన్నారు. ప్రజాభవనంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజలకు అనుమతి లభించిందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సకాలంలో అమలు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల మయం చేసి మాకు అప్పగించారని గవర్నర్ బీఆర్ఎస్ కు చురకలు అంటించారు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేశారన్నారు.
రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని, 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేశామన్నారు. త్వరలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని, అర్హులకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందని అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు, రెండు లక్షల ఉద్యోగాలపై దృష్టి పెట్టామన్నారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను చక్కబెడతామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. దశాబ్ద కాలంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేసామన్నారు.
ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేశారని ఆమె సంచలనం వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించామన్నారు. ప్రభుత్వం లోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలను అమలు చేసాం. త్వరలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులు మయం చేసి అప్పగించారు. దశాబ్ద కాలంలో నష్టపోయిన సంస్థలను పునరుద్ధరిస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని, రైతులు ,మహిళలు, యువతకు ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉన్నామని గవర్నర్ అన్నారు. ఇంటర్నెట్ ను కనీస అవసరంగా గుర్తించి అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నామని, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తామని అన్నారు. 1000 ఎకరాల్లో 10 , 12 ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తామని గవర్నర్ తమిళి సై తెలిపారు.
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
This website uses cookies.