Telangana Assembly Budget 2024 : రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మాకు ఇచ్చారు.. బీఆర్ఎస్ పై గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు..!

Telangana Assembly Budget 2024 : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ బీఆర్ఎస్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళోజీ కవితతో గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కంచెను తొలగించామన్నారు. ప్రజాభవనంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజలకు అనుమతి లభించిందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సకాలంలో అమలు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల మయం చేసి మాకు అప్పగించారని గవర్నర్ బీఆర్ఎస్ కు చురకలు అంటించారు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేశారన్నారు.

రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని, 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేశామన్నారు. త్వరలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని, అర్హులకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందని అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు, రెండు లక్షల ఉద్యోగాలపై దృష్టి పెట్టామన్నారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను చక్కబెడతామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. దశాబ్ద కాలంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేసామన్నారు.

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేశారని ఆమె సంచలనం వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించామన్నారు. ప్రభుత్వం లోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలను అమలు చేసాం. త్వరలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులు మయం చేసి అప్పగించారు. దశాబ్ద కాలంలో నష్టపోయిన సంస్థలను పునరుద్ధరిస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని, రైతులు ,మహిళలు, యువతకు ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉన్నామని గవర్నర్ అన్నారు. ఇంటర్నెట్ ను కనీస అవసరంగా గుర్తించి అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నామని, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తామని అన్నారు. 1000 ఎకరాల్లో 10 , 12 ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తామని గవర్నర్ తమిళి సై తెలిపారు.

Recent Posts

Kilimin Fish : ఇలాంటి ముక్కు ఉన్న చేపను మీరు చూశారా… దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు…?

Kilimin Fish : మనకు కొన్ని ప్రత్యేకమైన చేపలు సముద్రంలో కనిపిస్తాయి. ఈ సముద్రంలో జీవించే ఒక ప్రత్యేకమైన చేప.…

23 minutes ago

Coffee : అధిక బరువు ఉన్నవారికి ఇది ఒక దివ్య ఔషధం… ఒంట్లో కొవ్వు ఇట్లే కరుగుతుంది…?

Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…

1 hour ago

Zodiac Signs : ఈ రాశుల వారికి 64 సంవత్సరాల తరువాత అఖండ ధనయోగం… శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం…?

Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…

2 hours ago

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

11 hours ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

12 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

13 hours ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

14 hours ago

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…

15 hours ago