Categories: NewsTelangana

Pension : గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు

Advertisement
Advertisement

Pension : తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు తీసుకొచ్చింది. ఈ నెల 29వ తేదీ నుంచి ముఖ గుర్తింపు (ఫేసియల్ రికగ్నిషన్) విధానాన్ని ప్రవేశపెడుతూ, తొలిదశలో 23 లక్షల మందికి ఇది అమలు చేయనుంది. ముఖ్యంగా తపాలా శాఖ ద్వారా పింఛన్లు పొందే వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, వితంతువులు, బీడీ, చేనేత కార్మికులు, డయాలసిస్, హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితులకు ఈ విధానం వర్తించనుంది. వృద్ధుల వేళ్ల రేఖలు తొలిపోతుండటంతో బయోమెట్రిక్ పద్ధతి పనిచేయకపోవడం వల్ల కొంతమంది వారి పింఛన్ దుర్వినియోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ ఫేసియల్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది.

Advertisement

Pension : గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పద్ధతిలో కీలక మార్పు

Pension : తెలంగాణలో ఫేసియల్ రికగ్నిషన్ విధానంలో పింఛన్ పంపిణీ ప్రారంభం

ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి టీజీ ఆన్‌లైన్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. పోస్టుమాష్టర్లు, పోస్టుమ్యాన్‌లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఫోటోను ఆధార్‌లోని ఫోటోతో సరిపోల్చి గుర్తింపు నిర్ధారించిన అనంతరం, పింఛన్ చెల్లింపులు జరుపుతారు. ఫొటో ద్వారా గుర్తింపు సాధ్యపడని వారికి బయోమెట్రిక్ ద్వారా పింఛన్ ఇస్తారు.

Advertisement

రెండు పద్ధతులు ఫలించనప్పుడు, గ్రామ కార్యదర్శుల ధృవీకరణతోనే పింఛన్ అందిస్తారు. అయితే కొత్త విధానం అమలుతో కొన్నిచోట్ల అధికారులు ఆధార్‌తో పాటు ఓటర్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం వంటివి తప్పనిసరిగా కోరుతుండటం వల్ల పలువురు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వయసును నిరూపించేందుకు ఆధార్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సరిపోతుండగా, ఇప్పుడు అధిక డాక్యుమెంట్లు కావాలనడం తిరకాసు పెడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ తాజా పరిష్కార మార్గం ఎంతోమందికి మేలు చేయనుందన్న ఆశలు ఉన్నా, అమలులో పారదర్శకత, సహకారం లేకపోతే దీనివల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

Advertisement

Recent Posts

RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…

43 minutes ago

Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక‌పై వారికి రేష‌న్‌ బియ్యం క‌ట్‌..!

Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…

2 hours ago

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

3 hours ago

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

4 hours ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

5 hours ago

Samantha : ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు , సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha  : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…

6 hours ago

MSVPG : వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటున్న చిరు ఫ్యాన్స్ కి బిగ్ బ్యాడ్ న్యూస్

Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…

7 hours ago

Arava Sreedhar : డిల్లీ ని తాకిన జనసేన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం .. బీజేపీ ఆగ్ర‌హం..!

Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…

8 hours ago