Indiramma Indlu : ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారు ఈ పనులు తప్పనిసరిగా చేయడం మరిచిపోకండి..!
Indiramma Indlu : తెలంగాణలో ప్రభుత్వ పథకాలకు సామాన్యుల నమ్మకం సాధించడం కష్టం. కారణం అవినీతికి గల బలమైన చరిత్ర. “ప్రభుత్వ పథకం అంటే కమీషన్లు, ముఠా రాజకీయాలు” అన్న ముద్రను తుడిచేయాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తిగా పారదర్శకంగా అమలు చేస్తోంది.ఈ పథకంలో భాగంగా, ఒక్కో లబ్ధిదారుకు రూ.5 లక్షలు నాలుగు విడతల్లో ఇస్తున్నారు.
Indiramma Indlu : ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారు ఈ పనులు తప్పనిసరిగా చేయడం మరిచిపోకండి..!
Indiramma Indlu : పారదర్శకంగా..
అయితే ఈ మొత్తాన్ని ఎవరెవరికీ ఇస్తున్నామో స్పష్టంగా ఉండేందుకు ఆధార్ నంబర్ లింక్ చేయడం తప్పనిసరి చేశారు. ఆధార్ ఆధారంగా డేటా నమోదు చేస్తే, ఎటువంటి మానవ మోసాలు, ద్వంద్వ లబ్ధిదారులు బయటపడతారని ప్రభుత్వం భావిస్తోంది.బేస్మెంట్ పూర్తయ్యాక – రూ.1,00,000, గోడలు నిర్మాణానంతరం – రూ.1,25,000, స్లాబ్ అనంతరం – రూ.1,75,000,ఇల్లు పూర్తయ్యాక – రూ.1,00,000.ఈ నాలుగు దశల్లో డబ్బు చెల్లింపు ద్వారా కట్టడిలో అవినీతి చోటు చేసుకోకుండా చూస్తోంది ప్రభుత్వం.
లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా సొమ్ములు బదిలీ అవుతున్నాయి. ఇప్పటికే రూ.590 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. అయితే కొన్ని చోట్ల అకౌంట్ నంబర్లు, IFSC కోడ్ తప్పుగా ఉండటం వంటి సాంకేతిక సమస్యల కారణంగా జమలలో జాప్యం చోటుచేసుకుంది. అధికారుల జోక్యంతో వాటిని సరిచేశారు. ఇప్పుడు ప్రతీ లబ్ధిదారుడి ఖాతాలోనే నిధులు జమ అవుతున్నాయి. తద్వారా అధికారుల మద్దతుతో జరిగే ఎలాంటి మోసాలకు అవకాశం లేకుండా చేసింది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల పథకంను పూర్తి పారదర్శకంగా, వ్యవస్థాపితంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
