TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 June 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  స్టూడెంట్స్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్

  •  మహిళలకు ఉచితం..బస్సు పాస్ ప్రయాణికులకు భారం

  •  TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ పెంపుతో సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులపైనూ ఆర్ధిక భారం పెరిగింది. 20 శాతానికి పైగా ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రూ.1150గా ఉన్న ఆర్డినరీ పాస్ ధరను రూ.1400కి, రూ.1300గా ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్‌ను రూ.1600కి, రూ.1450గా ఉన్న మెట్రో డీలక్స్ పాస్‌ను రూ.1800కి పెంచారు. అంతే కాకుండా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గ్రీన్ మెట్రో ఎసీ పాస్ ధరల్లోనూ పెంపు చేపట్టారు.

TGSRTC సామాన్య ప్రజలతో పాటు స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : ప్రయాణికుల పై బాదుడు మొదలుపెట్టిన తెలంగాణ సర్కార్

ఈ ఛార్జీల పెంపుపై ప్రయాణికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రత్యేకించి పురుష ప్రయాణికులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండగా, మగ ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని మోపడం అన్యాయమని ఆరోపిస్తున్నారు. మహిళల ఓటు బ్యాంకును కాపాడేందుకు ఇస్తున్న ఉచిత ప్రయాణాల భారం మిగతా ప్రయాణికులపై వేసే విధానాన్ని సమంజసంగా భావించలేకపోతున్నారు.

ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న కారణంతో ఈ ధరలు పెంచినట్టు సమాచారం. అయితే ప్రభుత్వ తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా, నిర్ణయాలు తీసుకుంటున్న తీరుపై విపక్షాలు కూడా స్పందించే అవకాశం కనిపిస్తోంది. పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరచిన సమయంలో బస్ పాస్ ధరలు పెరగడం విద్యార్థుల ఆర్థిక భద్రతపై ప్రభావం చూపనుంది. ప్రజా రవాణాకు బలమైన ఆర్థిక మద్దతు కల్పించకుండా ధరలు పెంచడం వల్ల, టీఎస్‌ఆర్టీసీ సేవలపై విశ్వాసం తగ్గే ప్రమాదం ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది