
Telangana : సీఎం సారూ.. పొలాలు ఎండిపోతున్న కాస్త పట్టించుకోండి - రైతన్న ఆవేదన
Telangana : ఎండల తీవ్రత పెరగడం.. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నీటి కొరత కారణంగా పలు ప్రాంతాల్లో వరి పంట ఎండిపోతుండగా, కొన్ని చోట్ల అది పశువుల మేతగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. పంటల వివరాలను సేకరించి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులను ప్రభుత్వ అధికారం ఇచ్చింది. గ్రామాల వారీగా పంటల స్థితిగతులను తెలుసుకోవడానికి అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. సేకరించిన డేటా ఆధారంగా పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు ఎకరానికి రూ. 8,000 నుంచి రూ. 10,000 వరకు పరిహారం ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది.
Telangana : సీఎం సారూ.. పొలాలు ఎండిపోతున్న కాస్త పట్టించుకోండి – రైతన్న ఆవేదన
ఈ సంవత్సరం ప్రభుత్వం సన్నలకు రూ. 500 బోనస్ ప్రకటించడంతో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. యాసంగి సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, అందులో 45 లక్షల ఎకరాల్లో వరి పంటనే వేశారు. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. గత యాసంగి కంటే 8 లక్షల ఎకరాలు అదనంగా సాగుచేయడం వల్ల నీటి వినియోగం పెరిగింది. అధిక వేడి కారణంగా బోరుబావులు పొడిగిపోతుండగా, ఆయకట్టు చివరి ప్రాంతాల్లో వరి పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయి. గతేడాది అకాల వర్షాలతో రైతులు నష్టపోయినప్పుడు ప్రభుత్వం ఎకరానికి రూ. 10,000 పరిహారం ఇచ్చింది. ఇప్పుడు అదే తరహాలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రైతులు ఆత్మహత్యల వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.
నీటి కొరతకు పరిష్కారం కనుగొనేందుకు ఇటీవల సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లు, ఇరిగేషన్ ఇంజినీర్లు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగి వరికి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, తహసీల్దార్, వ్యవసాయ శాఖ, నీటి పారుదల, విద్యుత్ శాఖల అధికారులు కలిసి పని చేస్తున్నారు. కరెంట్ సరఫరా గంటలు పెంచడం, భూగర్భ జలాలను సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా రైతులకు మార్గదర్శకాలు ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నారు
Non Veg Summer : వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. బయట అడుగు పెట్టాలంటేనే…
Chanakya Niti : భారతీయ చరిత్రలో ఆచార్య చాణక్యుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన చెప్పిన నీతులు, సూత్రాలు…
LPG Price Hike 2026 : కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమైన ఏప్రిల్ 1వ తేదీనే చమురు కంపెనీలు…
Telangana తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఏళ్ల తరబడి అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ Contract…
Carmeni Selvam Movie : పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ…
Israel : ఈ ప్రపంచంలో Israel మనిషి తనను తాను సర్వజ్ఞానిగా భావిస్తాడు. తన దగ్గర ఉన్న సైన్స్ మరియు…
Russia India United States : ఈ మధ్య కాలంలో మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అమెరికా మరియు…
Raghav chadda : దేశంలో విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితం అనుకునేవారు కానీ ఇప్పుడు కాలం…
April Fools Day : ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు... స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో తోటి ఉద్యోగులు ఒకరినొకరు…
Telangana Chicken Shops Strike : మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్ అంటే ప్రాణం పెట్టే తెలంగాణ వాసులకు ఇది…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా…
Gold Silver Rate April 1st 2026 : పసిడి ప్రియులకు, సామాన్య కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ నుంచి వరుస…
This website uses cookies.