
Telangana : సీఎం సారూ.. పొలాలు ఎండిపోతున్న కాస్త పట్టించుకోండి - రైతన్న ఆవేదన
Telangana : ఎండల తీవ్రత పెరగడం.. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నీటి కొరత కారణంగా పలు ప్రాంతాల్లో వరి పంట ఎండిపోతుండగా, కొన్ని చోట్ల అది పశువుల మేతగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. పంటల వివరాలను సేకరించి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులను ప్రభుత్వ అధికారం ఇచ్చింది. గ్రామాల వారీగా పంటల స్థితిగతులను తెలుసుకోవడానికి అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. సేకరించిన డేటా ఆధారంగా పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు ఎకరానికి రూ. 8,000 నుంచి రూ. 10,000 వరకు పరిహారం ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది.
Telangana : సీఎం సారూ.. పొలాలు ఎండిపోతున్న కాస్త పట్టించుకోండి – రైతన్న ఆవేదన
ఈ సంవత్సరం ప్రభుత్వం సన్నలకు రూ. 500 బోనస్ ప్రకటించడంతో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. యాసంగి సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, అందులో 45 లక్షల ఎకరాల్లో వరి పంటనే వేశారు. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. గత యాసంగి కంటే 8 లక్షల ఎకరాలు అదనంగా సాగుచేయడం వల్ల నీటి వినియోగం పెరిగింది. అధిక వేడి కారణంగా బోరుబావులు పొడిగిపోతుండగా, ఆయకట్టు చివరి ప్రాంతాల్లో వరి పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయి. గతేడాది అకాల వర్షాలతో రైతులు నష్టపోయినప్పుడు ప్రభుత్వం ఎకరానికి రూ. 10,000 పరిహారం ఇచ్చింది. ఇప్పుడు అదే తరహాలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రైతులు ఆత్మహత్యల వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.
నీటి కొరతకు పరిష్కారం కనుగొనేందుకు ఇటీవల సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లు, ఇరిగేషన్ ఇంజినీర్లు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగి వరికి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, తహసీల్దార్, వ్యవసాయ శాఖ, నీటి పారుదల, విద్యుత్ శాఖల అధికారులు కలిసి పని చేస్తున్నారు. కరెంట్ సరఫరా గంటలు పెంచడం, భూగర్భ జలాలను సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా రైతులకు మార్గదర్శకాలు ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నారు
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.