
Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హరీశ్రావు
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నివేదికలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను వేలెత్తి చూపడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ నివేదికపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. 60 పేజీల నివేదిక కాకుండా, పూర్తి 655 పేజీల నివేదికను అసెంబ్లీలో పెట్టాలని, అప్పుడు తాము దానిని చీల్చి చెండాడతామని ఆయన సవాల్ విసిరారు.
Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హరీశ్రావు
హరీశ్ రావు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘోష్ కమిషన్ నివేదికపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రిపోర్ట్ మొత్తం ‘ట్రాష్’ లాగా ఉందని ఆయన అభివర్ణించారు. చరిత్రలో ఇలాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం రిపోర్టులు ఇచ్చాయని, కానీ అలాంటివి ఏవీ కూడా న్యాయస్థానాల్లో నిలబడలేదని ఆయన గుర్తు చేశారు. ఇందిరా గాంధీ, చంద్రబాబు నాయుడు మీద కూడా కమిషన్లు వేశారని, కానీ అవి కోర్టుల్లో నిలబడలేదని ఉదాహరణగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈ నివేదికను రూపొందించిందని ఆయన ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిపై హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒకవైపు ‘కాళేశ్వరం కూలిపోయింది’ అని చెబుతూనే, మరోవైపు యాదాద్రి జిల్లాకు వెళ్లి గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టడం, మల్లన్నసాగర్ నుండి మూసీలోకి నీళ్లు పోయడానికి రూ.6000 కోట్ల టెండర్లు ఖరారు చేయడం ఏంటని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగమేనని, కాళేశ్వరం నీళ్లే గంధమల్ల ప్రాజెక్టుకు వెళ్తాయని ఆయన స్పష్టం చేశారు. ‘కాళేశ్వరం కూలిందని అబద్ధపు మాటలు చెప్పి.. గంధమల్లకు కొబ్బరికాయలు కొట్టి, మల్లన్నసాగర్కు టెండర్లు ఎలా ఖరారు చేస్తావ్ బిడ్డా రేవంత్ రెడ్డి?’ అంటూ హరీశ్ రావు తీవ్రంగా నిలదీశారు.
మహారాష్ట్రతో కేసీఆర్ చేసుకున్న చారిత్రాత్మక నీటి ఒప్పందాల గురించి కూడా హరీశ్ రావు ప్రస్తావించారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తాము 152 మీటర్లకు అగ్రిమెంట్ చేస్తే మీరు ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారని, దానికి కేసీఆర్ ఆ విషయం నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తి 650 పేజీల కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై చర్చ పెట్టాలని, అప్పుడు నిజాలు ప్రజలకు తెలిసేలా ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్ రావు సవాల్ చేశారు. శాసనసభ వేదికగా తాము ఈ అంశాన్ని పూర్తిస్థాయిలో చర్చకు పెడతామని ఆయన అన్నారు.
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.