Venu Swamy :ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ మధ్య తెగ వార్తలలో నిలుస్తున్నారు. ఇటీవల నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు గురూజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జర్నలిస్టు సంఘాలు కూడా స్వామీజీ ఫైర్ అయ్యాయి. ఆయనపై మహిళా కమిషన్కి ఫిర్యాదు చేశాయి. ఇక వేణు స్వామిని అరెస్ట్ చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని న్యూస్ ఛానెల్స్ ఊదరగొట్టేస్తున్నాయి. సమయం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి.. అందులో అన్ని విషయాలు గురించి మాట్లాడాతా అంటూ.. ఓ వార్నింగ్ ఇచ్చారు వేణు స్వామి. కాని ఇప్పుడు ఆయన తన భార్యతో కలిసి ఓ వీడియో చేయగా, ఇందులో తాము ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు.
జాతకాల పేరుతో వేణుస్వామి మోసాలు చేస్తున్నారంటూ.. టీవీ 5 డిబేట్లతో స్వామి వారి యవ్వారాలన్నింటికీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు జర్నలిస్ట్ మూర్తి. అయితే జర్నలిస్ట్ మూర్తి రూ.5 కోట్లు డిమాంట్ చేశారంటూ షాకింగ్ ఆడియోను విడుదల చేశారు వేణు స్వామి దంపతులు. ఈ వీడియోలో తాను జర్నలిస్ట్ మూర్తి వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు వేణుస్వామి.నన్ను జర్నలిస్ట్ మూర్తి 2017లో మహా టీవీలో ఉన్నప్పటి నుంచి నాపై దాడి చేయడం ప్రారంభించారు. నన్ను నాశనం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. వాళ్లు అడిగిన డబ్బులు నేను ఇవ్వలేదు. గత ఎనిమిది నెలల నుంచి నా మీద జర్నలిస్ట్ మూర్తి గారి ఆధ్వర్యంలో నాపై దాడులు ప్రారంభించారు.
డబ్బులు ఇచ్చి.. కొంతమంది జ్యోతిష్యులను తీసుకుని వచ్చి నాకు వ్యతిరేకంగా టీవీలో డిబేట్ పెడుతున్నారు. నా గురించి చెడుగా ప్రచారం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలను జర్నలిస్ట్ మూర్తి చేస్తున్నారు. ఎంతోమంది కష్టాలను తొలగించిన నన్ను.. ఆత్మహత్య చేసుకునే స్థితికి నేను వెళ్లడం జరిగింది. నా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. గత 8 నెలలుగా నేను దాదాపు 15 కేజీలు బరువు తగ్గిపోయాను. దీనంతటికీ కారణం ఏంటో మీరే చూడండి అంటూ ఓ ఆడియో రిలీజ్ చేశారు వేణు స్వామి దంపతులు. వీళ్ల సంభాషణలో వినిపించిన పేర్లు చూస్తే.. మొన్న వేణుస్వామిపై మహిళా కమీషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరెవరు ప్రముఖ జర్నలిస్ట్లు అయితే వెళ్లారో.. వాళ్ల పేర్లు పనికట్టుకుని పలకడాన్ని బట్టి చూస్తుంటే ఇదేదో కాస్త తేడాగానే కనిపిస్తుంది.
Job Mela : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో…
Jaggery : బెల్లం అనేది రుచికి మాత్రమే కాదు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది అని మీకు తెలుసా.…
Namo Bharath Rapid Rail : దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల గురించి విసృత ప్రచారం…
Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధిపు కేసు విషయంలో రోజు రోజుకి నిర్గాంతపోయే నిజాలు…
Janhvi kapoor : ఎన్టీఆర్ దేవర సినిమా మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను కొరటాల…
Chandra Dosham : హిందూ మతంలో ఏడు రోజులు ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అయితే సోమవారం…
Chandrababu : రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2024 నాలుగో విడత సమావేశానికి గాంధీనగర్ ఆతిథ్యాం ఇస్తుండగా,…
Hyper Aadi : జానీ మాస్టర్ మీద ఢీ కంటెస్టెంట్, లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం మనకు తెలిసిందే.. కేవలం…
This website uses cookies.