Viral News : ఈనెల 9న వరంగల్ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళుతున్న బస్సు కరీంనగర్ బస్ స్టేషన్ లో ఆగిన సమయంలో పందెంకోడిని తన వెంట తీసుకు వెళుతున్న ప్రయాణికుడు దానిని బస్సులోనే మర్చిపోయాడు. బస్సులో బ్యాగ్ గమనించిన ప్రయాణికులు విషయాన్ని కంట్రోలర్ దృష్టికి తెచ్చారు. అందులో ఏముందో పరిశీలించేందుకు ఆర్టీసీ సిబ్బంది దానిని తెరిచి చూడగా భద్రంగా ప్యాక్ చేసి ఉన్న పందెంకోడి కనపడింది. దీంతో దాన్ని సంరక్షించేందుకు ఆర్టీసీ సిబ్బంది కరీంనగర్ డిపోకు తరలించారు. మూడు రోజులుగా సిబ్బంది అటు ఆర్టీసీ బస్సులతో పాటు పందెంకోడి సంరక్షణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. దానిని తీసుకువెళ్లేందుకు యజమాని వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో శుక్రవారం ఆర్టీసీ సిబ్బంది కోడిని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే కోడి తనదే అంటూ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు మహేష్ అనే వ్యక్తి. కరీంనగర్ ఆర్టీసీ బస్సులో దొరికిన కోడి నాదేనంటూ బాధితుడు వీడియో ద్వారా తన ఆవేదన తెలిపాడు. నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్ బ్రతుకుతెరువు కోసం రుద్రంగికి వచ్చినట్లుగా చెప్పారు. రుద్రంగి నుండి కరీంనగర్ మీదుగా నెల్లూరు వెళ్లే క్రమంలో తెల్లవారుజామున నిద్ర మబ్బులో కరీంనగర్ బస్టాండ్ లో బస్సు దిగి కోడిని మర్చిపోయానంటూ మహేష్ వీడియో విడుదల చేశాడు. పందెంకోడి వేలాన్ని నిలిపివేయాలని డిపో మేనేజర్ సజ్జనార్ ను వేడుకున్నాడు మహేష్. కోడి యజమాని కూడా వేలం పాటలో పాల్గొనాలని, కరీంనగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ నిర్లక్ష్య సమాధానం ఇచ్చాడంటూ మహేష్ వాపోయాడు.
అంతేకాదు ప్రయాణ సమయంలో తాను కోడికి కూడా టికెట్ తీసుకున్నానని చెప్పాడు. అందుకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని మహేష్ అంటున్నారు. నాదే కోడి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో కోడి వేలం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆర్టీసీ నిబంధనల ప్రకారం లాస్ ఆఫ్ ప్రాపర్టీ కింద మర్చిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత ఆర్టీసీ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వేలంపాట నిర్వహించాల్సి ఉంటుంది అని డిపో మేనేజర్ తెలిపారు. పందెంకోడి కోసం ఎవరు రాకపోవడంతో శుక్రవారం వేలం వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఎవరైనా పాల్గొనవచ్చని సూచించారు. వచ్చిన మొత్తాన్ని ట్రెజరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని తెలిపారు. కోడివేలం ఆఖరి నిమిషంలో కథ ఇలా అడ్డం తిరిగింది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.