Categories: NewsTelangana

CM Revanth Reddy : రేవంత్ రెడ్డికి ఆ ఇద్ద‌రి అక్క‌ల‌తో పంచాయ‌తీ ఏంది..అస‌లు క‌థ ఇదా?

Advertisement
Advertisement

CM Revanth Reddy : ఇప్పుడు అసెంబ్లీలోనే కాకుండా బ‌య‌ట కూడా రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయ‌కులు క‌స్సుబుస్సు మంటున్నారు. బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేయ‌డంతో ఈ అంశం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎప్పుడు లేని విధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు మహిళా నేతలను టార్గెట్‌ చేయడం చ‌ర్చ‌కి దారి తీసింది. ఢిల్లీ వస్తామని రాలేదనే కోపమే సీఎం వ్యాఖ్యలకు కారణమన్నట్లు సీతక్క ఇచ్చిన వివరణతో రాజకీయ వర్గాల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి.

Advertisement

CM Revanth Reddy : ఇది అస‌లు కార‌ణం..

గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి… సునీతా లక్ష్మారెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డికి మంచి సంబంధాలే ఉండేవని చెబుతున్నారు. అయితే తనను కాంగ్రెస్‌లోకి పిలిచి… ఆ ఇద్దరూ బీఆర్‌ఎస్‌లో చేరినట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కానీ, వివాదానికి అసలు కారణం అది కాదని సమాచారం. సబితకు రేవంత్‌ రెడ్డికి మధ్య రెండు మూడు విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయని… కానీ, ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటనలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహానికి కారణమని అంటున్నారు. 2018 ఎన్నికలకు ముందు సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానం మేరకే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చారనే విషయంతో అంతా ఏకీభవిస్తున్నా.. అలా పార్టీలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న ఓ సంఘటన వల్లే సబిత కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందంటున్నారు.

Advertisement

సీఎం రేవంత్‌రెడ్డి తాజా కోపానికి ఐదేళ్ల క్రితం నాటి ఈ ఘటన కారణం కాదని… అది ఓ సాకుగా మాత్రమే చెబుతున్నారని అంటున్నారు. ఒక‌ప్పుడు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య అక్కా తమ్ముళ్ల బంధం ధృడంగానే ఉండేదట. సబిత కుమారుడు కార్తీక్‌రెడ్డి కూడా సీఎం రేవంత్‌కు మంచి స్నేహితుడని చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఇంతటి అనుబంధం వల్లే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సబితను తిరిగి కాంగ్రెస్‌లోకి రమ్మని సీఎం ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. సబితతోపాటే నర్సాపురం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు పావులు కదిపినట్లు చెబుతున్నారు. సీఎం ప్రతిపాదనకు తొలుత ఈ ఇద్దరూ ఒకే అన్నా… చివరి క్షణంలో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. ఆఖరి నిమిషంలో హ్యాండ్‌ ఇవ్వడంతో రాహుల్‌ వద్ద తన ఇజ్జత్‌ పోయినట్లు సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు.

Advertisement

Recent Posts

T20 World Cup 2026: కివీస్ కోట బద్దలు.. న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…

18 minutes ago

Telangana : తెలంగాణా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారం ఎవరిది..?

Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…

2 hours ago

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

3 hours ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

4 hours ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

6 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

10 hours ago