
Rising Sea Level
Rising Sea Level : వరల్డ్ వైడ్ గా కాలుష్యం రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. భారీగా వాయు కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ టైం లో వాతావరణంలో వచ్చే మార్పులు తీవ్ర పరిణామా లకు దారి తీస్తున్నాయి.. వాతావరణం కాలుష్యం వల్ల దృవాల వద్ద మంచు బాగా కరగుతుంది.. వీటితో పాటు సముద్ర మట్టాల యొక్క స్థాయి కూడా ఊహించని విధంగా పెరుగుతున్నాయి. దాని వల్ల ఎన్నో విపత్తులు సంభవించే అవకాశం ఉంది. సముద్ర తీరాల ప్రాంతాలు ఇప్పటికే కొద్దికొద్దిగా కనుమరుగైపోతున్నాయి అని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలూ చెబుతున్నారు. పర్యావరణ వేత్తలచెబుతున్న సూచనలు ఇంకా శాస్త్రవేత్తల హెచ్చరికలను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో చాలా పెద్ద ప్రమదం రాబోతుందని అనిపిస్తుంది. అయితే ఈ హెచ్చరికలు ఎక్కువ మంది ప్రజలు పరిగణలోకి తీసుకోవడంలేదనే చెప్పాలి. ప్రకృతి విలయ తాండవానికి కూడా ఈ కాలుష్యం ఒక కారణం అని వాటికి వాతావరణంలో జరుగుతున్న మార్పులే మూలాలని అంటుంటారు. అయితే ఈ టైమ్ లో బెంగళూరు లో ఉన్న సెంటర్ ఫర్ స్టడీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పాలసీ (CSTEP) సంస్థ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది.
1987-2021 మధ్య పెరిగిన సముద్రమట్టాల స్థాయిని చూస్తే ఫ్యూచర్ లో ముంబై, చెన్నై, ఇంకా తిరువనంతపురం, మంగుళూరు, అటు కోచి, కన్యాకుమారి, ఉడిపి, కోజికోట్తుత్తుకుడి, పూరి, ఫనాజీ, హల్దియాలో ఈ సంస్థ అధ్యయనాలు చేపట్టి షాకింగ్ న్యూస్ చెప్పింది. 3 ఏళ్ల క్రితం అంటే 2021 వరకూ ఈ నగరాల్లో సముద్రమట్టాలు ఏ స్థాయిలో పెరిగాయనేది సీ.ఎస్.టీ.ఈ.పీ ఒక నివేదిక ఇచ్చింది. ఇది చూస్తే హల్దియా (2.72 సెం.మీ), విశాఖపట్నం (2.38 సెం.మీ), ముంబై (4.44 సెంటీ మీటర్లు), కొచీ (2.21 సెం.మీ) లెక్కన సముద్రమట్టాల స్థాయి అత్యధికంగా బాగా పెరిగిందని తెలిపింది. ఇలా చూస్తే చూసుకుంటే… 2040 నాటికి భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై 10% పైగా మునిగిపోనుందని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
ఇదే వరుసలో టూరిజం కేపిటల్ గా చెప్పుకునే గోవా లో కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. గోవా రాజధాని పణాజీలో కూడా పెరుగుతున్న సముద్రమట్టం కారణంగా 10% భూభాగం దాదాపుగా మునిగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. వీటితో పాటే యానం, తుత్తుకూడిలో కూడా 10% వరకు ఆ ప్రాంత భూభాగం కనుమరుగయ్యే అవకాశాలున్నాయని సీ.ఎస్.టీ.ఈ.పీ తన తాజా అధ్యయనంలో పేర్కొంది. సౌత్ లో ఈ ఎఫెక్ట్ చెన్నైకి 5 – 10% ఉంటుందని తెలిపింది. ఏపీలో ఆర్థిక రాజధానిగా చెబుతున్న విశాఖపట్నంలో కూడా 1 నుంచి 5 % వరకూ భూభాగాన్ని కోల్పోనున్నాయని హెచ్చరించింది.
BRS Party : మిర్యాలగూడ miryalaguda పట్టణం సీతారాంపురం (42వ వార్డు) మాజీ కౌన్సిలర్ చిదెళ్ళ సత్యవేణి – వెంకటేశ్వర్లు…
Corporator Venkatesh Goud : 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారి లోని ఇందిరాగాంధీ స్టేట్యూ…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్, 9వ డివిజన్ మేడిపల్లిలోని సుమా రెసిడెన్సీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేట్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 9 వ డివిజన్ మేడిపల్లి ధరణి కాలనీ అసోసియేషన్ ఎన్నికలు…
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ central government వాటా ఖరారయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.…
Vivo V23 Max Review : స్మార్ట్ఫోన్ SmartPhone మార్కెట్లో స్టైలిష్ డిజైన్స్, అద్భుతమైన కెమెరాలకు పెట్టింది పేరు వివో…
Gas Cylinder : ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ అంటే మన కళ్లముందు ఒకే చిత్రం కనిపించేది. ఎరుపు రంగులో ఇనుముతో…
AP 2029 Elections : ఏపీ రాజకీయ ముఖచిత్రం 2029 ఎన్నికల నాటికి సమూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం…
This website uses cookies.