AP Politics : ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ తెలీదు. అప్పటివరకు కూల్గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. అయితే. వచ్చే ఎన్నికల కోసం వైసీపీ పార్టీ, సీఎం జగన్ రెండేళ్ల ముందు నుంచే కసరత్తు ప్రారంభించారు. సీఎం జగన్ మరోసారి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకోవాలని భావిస్తున్నారట. దీంతో ఏ పార్టీతో పొత్తు లేకుండానే మరోసారి ఒంటిచేత్తో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ పార్టీ చాలా పకడ్భందీ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. 2019లో ప్రయోగించిన ఫార్ములానే వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాట.
2019 ఎన్నికల ప్రచారంలో ఆది నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరూ ఒక్కటే అని.. పార్టీలు వేరైనా వీరి మధ్య రహస్య ఒప్పందం ఉందని వైసీపీ తెగ ప్రచారం చేసింది. పవన్ను టీడీపీ సీక్రెట్ ఫ్రెండ్గా ప్రజలను నమ్మించింది. వైసీపీ సోషల్ మీడియాతో పా0టు, జగన్ తన పాదయాత్రలోనూ ఈ విషయాన్ని పదే పదే నొక్కి చెప్పారు. పీకే టీం కూడా నెట్టింట చంద్రబాబు, పవన్ మధ్య రహస్య బంధాన్ని వైరల్ చేశారు. ఈ మాటలను నమ్మిన ఏపీ ప్రజలు ఇరు పార్టీలను చిత్తుగా ఓడించినట్టు తెలిసింది.
జనసేన అధినేత పవన్ కారణంగానే బీసీలు తమకు దూరమయ్యారని టీడీపీ పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. కాపు, కమ్మ కాంబినేషన్ గత ఎన్నికల్లోవర్కౌట్ కాలేదని తెలుగు తమ్ముళ్లు భావించారు. అందువల్లే ఇటు పవన్, అటు చంద్రబాబు ఇద్దరూ నష్టపోవాల్సి వచ్చింది. వీరి నినాదం వలన కాపు, కమ్మలకు వ్యతిరేకంగా ఉన్న బీసీలంతా వైసీపీకి అండగా నిలిచారు. దీనిని గుర్తించిన చంద్రబాబు మరోసారి ఈ తప్పు చేయొద్దని నిర్ణయించుకున్నారని తెలిసింది. కానీ. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం అసలే లేదని తెలుస్తోంది. ఇప్పటికే జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోగా, ఏపీలో కాంగ్రెస్ ఊసే లేదు. మరి చంద్రబాబు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏదేమైనా సీఎం జగన్ వ్యూహంతో జనసేన, టీడీపీకి గత ఎన్నికల్లో చెక్ పెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రజల మనస్సు మారొచ్చు. టీడీపీ, జనసేన మీద గల నెగెటివ్ అభిప్రాయం పోవచ్చు. అయితే, ఈసారి జగన్ ఎలాంటి వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగుతారని అంతా అనుకుంటున్నారు. ఒంటరిగా బరిలోకి దిగుతున్న జగన్ తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల మీదే ఆధారపడుతారా.. ప్రశాంత్ కిషోర్ సాయం మరోసారి తీసుకుంటారా.. ? అని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకును కాపాడుకుంటే మరోసారి జగన్ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.