sensational decision of cm jagan acb officials who entered the field
ACB review Case : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాత్రికి రాత్రే తన నిర్ణయాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పుడు ఎవరికి మూడుతుందో అని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్నది జగన్ ప్రభుత్వమే కావున తమ పార్టీ వారిపై అయితే దాడులు చేయాలని సీఎం ఎలాగూ ఆదేశించలేరు.
జగన్ తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షం వారికి మూడిందా అంటే ప్రత్యక్షంగా కాకపోయినా ప్రజల ముందు దోషులుగా నిలపడానికి ముఖ్యమంత్రి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అదేలా అంటే గతంలో అధికారులు, ఉద్యోగులపై పెట్టిన ఏసీబీ కేసులను పున పరిశీలనకు ఒక హైపర్ కమిటీ ఏర్పాటు చేశారు.ఏసీబీ కేసులు అనేవి ఎక్కువగా అవినీతి జరిగినప్పుడు నమోదు చేస్తారు. అధికారులు, ఉద్యోగులు లంచం తీసుకుంటున్న క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ బృందాలు దాడులు జరిపి వారిపై కేసులు నమోదు చేస్తాయి.
sensational decision of cm jagan acb officials who entered the field
అయితే, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జగన్కు మద్దతు ఇస్తున్నారనే నెపంతో చాలా మందిపై అక్రమంగా ఏసీబీ కేసులు నమోదు చేసినట్టు జగన్ గుర్తించారు. దీంతో ఉద్యోగులు,అధికారుల సర్వీసులకు చిక్కులు ఏర్పడ్డాయి.తాజాగా వారికి విముక్తి కల్పించేందుకు జగన్ సుముఖంగా ఉన్నారట.. ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీలో హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, పరిశ్రమల శాఖ చీఫ్ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, పబ్లిక్ సర్వీసెస్ సెక్రటరీలు సభ్యులుగా ఉన్నారు. వీరు టీడీపీ హయాంలో నమోదైన ఏసీబీ కేసులను క్షుణ్ణంగా పరిశీలించి.. అక్రమంగా నమోదైన కేసులను గుర్తించనున్నారు. ఈ నిర్ణయంతో ఏపీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, అవినీతి అధికారులకు కాపాడేందుకు జగన్ సర్కార్ కృషి చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
This website uses cookies.