The Actual Number Of Seats To Be Won By YSRCP Is.!
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేయొద్దని టీడీపీ పొలిట్బ్యూరో నిర్ణయించింది. ఉమ్మడి ఏపీలో మరణించిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చాక అక్కడ ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని నెలకొల్పింది టీడీపీయేనని పొలిట్బ్యూరో పేర్కొంది. నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ ఆ సంప్రదాయాన్ని పాటించలేదని టీడీపీ నేతలు గుర్తు చేశారు. బద్వేలు బరి నుంచి తప్పుకోవడంపై స్థానిక నేతలతో చర్చించాలని జిల్లా ముఖ్యనేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.
Ysrcp
బద్వేలు ఉపఎన్నికల్లో పోటీచేయడం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ తెలిపారు. మరోవైపు బీజేపీ మాత్రం పోటీకి ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే కడప జిల్లాలో పర్యటించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని ప్రకటించారు. అలాగే బద్వేలు నియోజకవర్గ పరిధిలో రెండు జాతీయ రహదారులు నిర్మించింది తమ ప్రభుత్వమేనన్నారు. ఐతే జనసేన, టీడీపీల నిర్ణయం నేపథ్యంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది ఆసక్తికరంగా మారింది.
tdp
కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేలు నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన డాక్టర్ జి. వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఆయన సతీమణి డాక్టర్ సుధను వైసీపీ అధిష్టానం అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. త్వరలోనే డాక్టర్ సుధ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక రెండు రోజుల క్రితం బద్వేలు ఉపఎన్నికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ముఖ్యనేతలతో చర్చించారు. పార్టీని గెలిపించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు.
Janasena
గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రావాలని.. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించాలని.. గతంలో కంటే ఓటింగ్ శాతం పెంచాలని కూడా నేతలకు జగన్ టార్గెట్ విధించారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడం, బీజేపీ ఇంకా స్పష్టతనివ్వకపోవడంతో ఏకగ్రీవమవుతుందనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ విషయంలో బీజేపీ పోటీకి దిగుతుందా లేక వైసీపీ నేతలు మాట్లాడి ఏకగ్రీవానికి ఒప్పిస్తారా..? అనేది వేచి చూడాలి.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.