Ysrcp : వైసీపీకి భయపడే.. అక్కడ పోటీ నుంచి తప్పుకున్నారా..?

ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బద్వేల్‌ ఉపఎన్నికలో పోటీ చేయొద్దని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. ఉమ్మడి ఏపీలో మరణించిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇచ్చాక అక్కడ ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని నెలకొల్పింది టీడీపీయేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది. నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ ఆ సంప్రదాయాన్ని పాటించలేదని టీడీపీ నేతలు గుర్తు చేశారు. బద్వేలు బరి నుంచి తప్పుకోవడంపై స్థానిక నేతలతో చర్చించాలని జిల్లా ముఖ్యనేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.

Ysrcp

బద్వేలు ఉపఎన్నికల్లో పోటీచేయడం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ తెలిపారు. మరోవైపు బీజేపీ మాత్రం పోటీకి ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే కడప జిల్లాలో పర్యటించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని ప్రకటించారు. అలాగే బద్వేలు నియోజకవర్గ పరిధిలో రెండు జాతీయ రహదారులు నిర్మించింది తమ ప్రభుత్వమేనన్నారు. ఐతే జనసేన, టీడీపీల నిర్ణయం నేపథ్యంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది ఆసక్తికరంగా మారింది.

tdp

Ysrcp గెలుపుకు మల్లగుల్లాలు..

కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేలు నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన డాక్టర్ జి. వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఆయన సతీమణి డాక్టర్ సుధను వైసీపీ అధిష్టానం అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. త్వరలోనే డాక్టర్ సుధ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక రెండు రోజుల క్రితం బద్వేలు ఉపఎన్నికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ముఖ్యనేతలతో చర్చించారు. పార్టీని గెలిపించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు.

Janasena

గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రావాలని.. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించాలని.. గతంలో కంటే ఓటింగ్ శాతం పెంచాలని కూడా నేతలకు జగన్ టార్గెట్ విధించారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడం, బీజేపీ ఇంకా స్పష్టతనివ్వకపోవడంతో ఏకగ్రీవమవుతుందనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ విషయంలో బీజేపీ పోటీకి దిగుతుందా లేక వైసీపీ నేతలు మాట్లాడి ఏకగ్రీవానికి ఒప్పిస్తారా..? అనేది వేచి చూడాలి.

Recent Posts

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

53 minutes ago

Allu Aravind : అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్..వెంటనే కూల్చేయాలని ఆదేశాలు

Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…

2 hours ago

Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?

Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…

3 hours ago

Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…

4 hours ago

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

5 hours ago

Apple Event | ఆపిల్‌ ఈవెంట్‌ 2025: ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్‌, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన

Apple Event | ఐఫోన్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన…

6 hours ago

Group 1 | గ్రూప్-1 మెయిన్స్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు .. మెరిట్ లిస్ట్ రద్దు, రీవాల్యుయేషన్ లేదా తిరిగి పరీక్షలు

Group 1 | గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…

7 hours ago

Rains | బంగాళాఖాతంలో మ‌రో అల్పపీడనం ప్రభావం.. రానున్న రోజుల‌లో భారీ వ‌ర్షాలు

Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…

8 hours ago