
Revanth Reddy resigns as MP Super plan to hit KCR
Revanth Reddy : టీపీసీసీ చీఫ్గా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి నియామకం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపించింది. అయితే, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రేవంత్ నాయకత్వాన్ని బలపరిచినప్పటికీ ఆ పార్టీలో ఉన్న సీనియర్లు మాత్రం రేవంత్ను సపోర్ట్ చేసేందుకు ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే వారి మద్దతు కోసం రేవంత్ వారిని సంప్రదించి వారిని ఒప్పించి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే ‘దళిత, గిరిజన ఆదివాసీ’ దండోరా సభలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన రేవంత్ .. త్వరలో నిరుద్యోగుల పక్షాన పోరు జరపనున్నారు. రేవంత్రెడ్డి టీపీసీసీ చీఫ్గా నియామకం అయిన తర్వాత పార్టీలో సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి.
Revanth Reddy resigns as MP Super plan to hit KCR
రేవంత్ ఏక పక్షనిర్ణయాలు తీసుకుంటున్నారని, సమిష్టి నిర్ణయాలతోనే పార్టీ నడుస్తుందని రేవంత్ పట్ల సీనియర్ నేతలు కొందరు బహిరంగంగానే రేవంత్ను హెచ్చరించారు. అయితే, సీనియర్లను కలుపుకుని పార్టీని ముందుకు తీసుకుపోవాలని రేవంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయమై ఇన్ని రోజుల పాటు తాత్సారం చేసి చివరకు విద్యార్థి నాయకులు బి.వెంకట్ను ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే హుజురాబాద్ బై పోల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రేవంత్కు మద్దతు పలుకుతారా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచి ప్రచారంలో దూసుకెళ్తారా? లేదా చూడాలి మరి.. అయితే, పార్టీ సీనియర్ నేతలు హుజురాబాద్ ఉప ఎన్నికలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దాని బాధ్యత మొత్తంగా రేవంత్పైనే పడాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
kcr
అందుకే రేవంత్కు హుజురాబాద్ బై పోల్ సవాల్గా మారనుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ప్రచార పర్వంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ‘ప్రజా దీవనె యాత్ర’ పేరిట పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రజలతో మమేకమై తనను గెలిపించాలని కోరుతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు, స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈటల తరఫున ఆల్రెడీ ప్రచారం నిర్వహించారు.
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
Night Coffee : రాత్రి వేళల్లో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువులు లేదా…
Pani Puri : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్లలో పానీపూరి ఒకటి. గోల్ గప్పా, గప్చుప్, పుచ్కా…
Mahalakshmi Free Bus : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు…
Weight Loss : చాలామంది యువ వయసులో సులభంగా బరువు తగ్గగలుగుతారు. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత అదే…
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్…
Heart Health : గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలామంది కొలెస్ట్రాల్ స్థాయిలను మాత్రమే నియంత్రించడంపై దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా…
Two Year Old Child : హర్యానాలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటలో భాగంగా రిమోట్ కంట్రోల్లో…
This website uses cookies.