Prashant Kishor : భారత రాజకీయాల్లో వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎవరి వైపున ఉంటే వారు తప్పకుండా గెలుస్తారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే, పీకే వ్యూహాల వల్ల విజయాలు సాధించిన వారు చాలా మందే ఉన్నప్పటికీ ఈ సారి ఆయనకు పెద్ద సవాల్ వచ్చిపడిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.తెలంగాణలో మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పాల్గొననుంది. ఇందుకుగాను ఇప్పటికే నుంచి వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్.షర్మిల గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది.
కాగా, షర్మిల కోసం పీకే టీం పని చేస్తుండగా, ఇక్కడ షర్మిల గెలుపోటుల ద్వారానే రాజకీయ వ్యూహకర్తగా పీకే పని తీరు, సత్తా బయటపడుతుందనే కామెంట్స్ రాజకీయ వర్గాల నుంచి వినబడుతున్నాయి. పీకే అనేక రాష్ట్రాల్లో వ్యూహకర్తగా పని చేసి ఆయా రాజకీయ నాయకులను ముఖ్యమంత్రులను చేశారు. ఏపీ నుంచి మొదలుకుని ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ వరకు పీకే వ్యూహాలు ఫలించాయి. పశ్చిమబెంగాల్లో ఈ సారి కమలనాథులు సత్తా చాటుతారనే వాదనలు బలంగా వినబడినప్పటికీ మమతా బెనర్జీ వైపు నిలబడి ఆమెకు ఫుల్ మెజారిటీని అందించారు పీకే. ఈ క్రమంలోనే పీకే రాజకీయ పలుకుబడి ఇంకా పెరిగింది. కాగా, మిగతా రాష్ట్రాలు వేరు తెలంగాణ వేరు… తెలంగాణలో షర్మిలను పీకే గెలిపించగలడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో బలమైన ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది.
రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ను ఓడించి వైఎస్ఆర్టీపీ అధికారంలోకి రాగలదా? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. తెలంగాణలో ప్రతిపక్షాలు కూడా బలంగానే ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీపై బలంగా పోరాడుతున్నారు. మరో వైపున ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్గా ఉండి.. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్టీపీ ఏ మేరకు ప్రభావం చూపగలదని అనుకుంటున్నారు. ఈ నెల 20 నుంచి షర్మిల ప్రారంభించే పాదయాత్రను పీకే టీం ప్లాన్ చేయగా, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ కనీసంగా పది సీట్లైనా గెలుచుకోగలదా? అని పలువురు చర్చించుకుంటున్నారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.