Viral Video : సమాజంలో రకరకాల సంఘటనలు అందరిని విబ్రాంతికి గురిచేస్తాయి. ముఖ్యంగా మనసుకు దగ్గరైన వాళ్ళు చనిపోయి మళ్లీ తిరిగి వస్తే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. అటువంటి సంఘటన తాజాగా ఒకటి జరిగింది. తన తల్లి చనిపోయింది అని తెలిసిన ఒక కొడుకు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజే అనుకోని విధంగా తన తల్లి… ఇంట్లో ప్రత్యక్షమయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరువల్లూరు జిల్లా..సెల్ తైకర్ గ్రామానికి చెందిన సొకమల్ కు ముగ్గురు కొడుకులు. అయితే ఆమె ప్రస్తుతం సెల్ టైకర్ కండ్రికలోని చిన్న కొడుకు దగ్గర ఉంటుంది. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం సొకమల్ కు ఉంటున్న చిన్న కొడుకు ఇంటి వద్ద ఎదురింటి మహిళతో గొడవ ఏర్పడింది.
ఈ గొడవలో సొకమల్ స్వల్పంగా గాయపడటం జరిగింది. అయితే ఇంత జరిగినా కొడుకు ఏమి స్పందించకపోవడంతో అలిగి చెన్నైలో ఉంటున్న పెద్ద కొడుకు వద్దకు వెళ్ళిపోయింది. అయితే ఆమె ఇంటి నుండి బయటకు వెళ్తున్న సమయంలో ఒంటిపై ఎలాంటి దుస్తులు అయితే వేసుకోవడం జరిగిందో అదే రంగు దుస్తులతో పుట్లూరు రైల్వే ట్రాక్ పై వృద్ధురాలి శవం గుర్తు తెలియని రీతిలో కనిపించింది. దీంతో మృతి చెందిన వృద్ధురాలు సొకమల్ గా భావించిన ఆమె చిన్న కొడుకు రైల్వే స్టేషన్ నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి బంధువులకు సమాచారాన్ని అందించి అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ క్రమంలో చెన్నైలో ఉన్న పెద్ద అన్నయ్యకు సమాచారం అందించడానికి ప్రయత్నాలు చేయగా… ఇద్దరి మధ్య అప్పటికే గొడవలు ఉండటంతో.. పెద్దన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మే 28వ తారీకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. కాగా సొకమల్ సోమవారం ఉదయం చిన్న కొడుకు శరవన్ ఇంటి ముందుకు రావడంతో… అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సొకమల్ ప్రాణాలతో వచ్చారని తెలియటంతో జనం పెద్ద ఎత్తున గుమ్మి గూడారు. ఈ క్రమంలో తల్లి ఇంటికి రావడంతో కొడుకులు ఫుల్ సంతోషంగా ఉన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి అంతకుముందు జరిగిన విషయాన్ని కూడా వివరించారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.