Viral Video : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను వినియోగించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్క విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. అలాగే ఎవరైనా తమ అభిప్రాయాలను, ఏదైనా మాట్లాడటానికి కూడా సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇకపోతే నిత్యం వేలాది వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి.
మరికొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి, అలాగే ఇంకా మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కొంచెం బాధపడేలా కొంచెం భయానకంగా ఉంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బండరాళ్ల మధ్యలో ఇరుక్కున్నాడు. అక్కడి నుంచి బయటికి రాలేక నానా అవస్థలు పడ్డాడు. అంత పెద్ద బండరాల మధ్యలో ఆ వ్యక్తి దూరడంతో బయటికి రాలేడేమో అనుకున్నారు. చివరికి ఎలాగోలా బయటికి వచ్చేసాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. అది కాస్త క్షణాల్లో వైరల్ అయింది.
కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని కోటలో బోయ రాజేష్ అనే యువకుడు తన మేక కనిపించకపోవడంతో బండరాళ్ల మధ్యలో వెళ్లిందనే అనుమానంతో అందులోకి వెళ్ళాడు. అక్కడ ఏమి కనిపించకపోవడంతో బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా అతడు ఎటు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఎంత ప్రయత్నించిన ఆ బండరాల మధ్యలో నుంచి బయటికి రాలేకపోయాడు. అలా చాలాసేపు బయటికి వచ్చేందుకు ప్రయత్నించాడు కానీ ఫలితం లేకపోవడంతో చివరికి రాజేష్ తన ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి వచ్చిన ఆ ఊరి జనం అతడిని తాళ్ళ సహాయంతో పైకి లాగేశారు. దీంతో రాజేష్ కి ప్రాణాపాయం తప్పింది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.