Home » Exclusive » Viral Video In One Missed Call Cost Two Lives
Exclusive

Viral Video : ఒక్క మిస్డ్ కాల్ రెండు ప్రాణాలను బలిగొంది.. వీడియో

Authored By
Breaking News
The Telugu News | Updated on: June 2, 2023 11:20 am
Advertisement

Viral Video : టెక్నాలజీ పుణ్యమా ఎంత మంచి జరుగుతుందో అదే రీతిలో చెడు కూడా అదేవిధంగా జరుగుతుంది. ముఖ్యంగా సెల్ ఫోన్ వచ్చాక మనిషి జీవన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్మార్ట్ మొబైల్ ఫోన్ ద్వారా ఏర్పడుతున్న రకరకాల పరిచయాలు వల్ల పెళ్లి పెటాకులు అయిపోతున్నాయి. ఇదే సమయంలో ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇదే తరహాలో ఒక్క మిస్డ్ కాల్ ఇద్దరి ప్రాణాలను బలిగొనేలా చేసింది. అతనికి 25 సంవత్సరాలు ఆమెకు 45 ఏళ్లు. పైగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. పెళ్లయి భర్త ఉండి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా కానీ ఆమె 25 సంవత్సరాల యువకుడు రాంగ్ కాల్ తో కనెక్ట్ అయ్యి ఇద్దరు గాఢమైన ప్రేమతో మునిగితేలారు.

Advertisement

ఆమె ఇంట్లో ఈ విషయం తెలిసిన తర్వాత కలిసి బతకలేమని భావించిన ఇద్దరు చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. టీచర్ గా పనిచేస్తున్న సుజాత… రాజేష్ మృతి కేసులో సంచలన విషయాలు అందరికీ విభ్రాంతిని కలిగిస్తున్నాయి. హైదరాబాద్ హయత్ నగర్ కి చెందిన టీచర్ సుజాత… పంచత్కల్ మళ్లీ కి చెందిన రాజేష్ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఏడాదిన్నర క్రితం రాంగ్ కాల్ ద్వారా రాజేష్-టీచర్ సుజాత మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసిన ఇద్దరు పలు ప్రాంతాల్లో తిరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సుజాత పై రాజేష్ విపరీతంగా ప్రేమ పెంచుకోవడంతో… సుజాత ఇంటి చుట్టూ రోజులు తిరిగేవాడిని విచారణలో పోలీసులు తేల్చారు.

Advertisement

Viral Video in One missed call cost two lives

అంతే కాదు రాజేష్ సెల్ ఫోన్ కి సుజాత న్యూడ్ ఫోటో లు కూడా పంపించేదని దీంతో.. గాఢమైన ప్రేమలో రాజేష్ నగరంతో సుజాతతో మాట్లాడాలని తిడతావటంతో ఇంట్లో విషయం తెలియడంతో ఇద్దరు చనిపోదామనుకున్నా రు. ఈనెల 26వ తారీఖున ఇద్దరు కలిసి పురుగుల మందు కొన్నారు. ఇద్దరు కలిసి తాగుదామని నిర్ణయించుకున్న తర్వాత… సుజాత పిల్లలను ఆఖరి సారి చూస్తానని ఇంటికి వచ్చింది. అదే రోజు పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలయ్యింది. విషయం తెలుసుకుని రాజేష్ 28వ తారీఖున పురుగుల మందు తాగి చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 29 నాది సుజాత మృతి చెందగా అదే రోజు కుళ్ళిపోయిన స్థితిలో రాజేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి