సినిమాలో జరిగే కొన్ని సంఘటనలు రియల్ లైఫ్లో జరగడం మనం చాలా సార్లు చూశాం. వాటిని చూసి ప్రతి ఒక్కరు చూసి ఆశ్చర్యపోతుంటారు.తూర్పుగోదావరి జిల్లా కడియంలో జరిగిన ఘటన అందరిని ఆశ్చర్యపరచింది. కడియం గ్రామానికి చెందిన బత్తిన వెంకటనందు ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిప్లొమా చదివాడు. అదే సమయంలో కర్నూలు జిల్లా చాలగమర్రి మండలం గొడిగనూరు గ్రామానికి చెందిన గంగవరం స్నేహతో అతనికి పరిచయం అయింది. వారిద్దరి పరిచయం మెల్లగా ప్రేమగా మారింది. అయితే చదువు తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆ ఇద్దరు భావించారు. కాకపోతే పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారా అని వారిలో భయం ఉండేది..
అయితే ఏప్రిల్ 13న విజయవాడలోని దుర్గగుడిలో నందు-స్నేహ పెళ్లి చేసుకోవాలని భావించారు.అనంతరం వెంకటనందు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడంతో బంధువుల సమక్షంలో ఈ నెల 21 న ఆదివారం ముహూర్తం పెట్టుకొని పెళ్లి చేసుకుంటున్నామని వధువు తల్లిదండ్రులకు మెసేజ్ పంపారు. అంతేకాకుండా అడ్రెస్ కూడా పంపింది పెళ్లి కూతురు. అయితే ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు బంధువులు ఫంక్షన్ హాల్ వచ్చి నానా రచ్చ చేసి ఆమెని తీసుకెళ్లారు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ నడిచింది. వధువు తరపు బంధువులు అక్కడికి చేరుకుని పెళ్లికొడుకు, వాళ్ల బంధువులపై కారం చల్లారు. స్నేహను అపహరించేందు కు ప్రయత్నించారు.
పెళ్లికొడుకు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆ క్రమంలో నందుతో సహా, బంధువులకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం వధువును బలవంతంగా అక్కడ నుంచి ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చి అక్కడే ఉన్న కారులో ఎక్కించి వధువుని స్వగ్రామానికి తీసుకెళ్లారు.ఈ విషయంలో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సినీ ఫక్కీలో ఈ ఘటన జరగడం పట్ల అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.