
ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో అధికార వైసీపీ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజల దీవెనలతోనే పరిషత్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినట్లు జగన్ తెలిపారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు ఏపీలోని ప్రతీ కుటుంబం, ప్రతీ మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 13,081 పంచాయతీలకుగాను 10,536 పంచాయతీల్లో అనగా 81 శాతం వైసీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని వివరించారు.
మున్సిపల్ ఎన్నికల్లోనూ ఏకంగా 75కు 74 చోట్ల అనగా 99 శాతం వైసీపీ అభ్యర్థులే గెలిచారని పేర్కొన్నారు. ప్రతీ ఎన్నికల్లో సడలని ప్రేమను, అప్యాయతను ప్రజలు పంచుతున్నారన్నారు. ప్రతిపక్షం ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లో లేదని విమర్శించారు. వైసీపీ సర్కారును ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించినప్పటికీ, ప్రజలు తమ వెంటే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం జగన్ పేర్కొన్నారు.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.