ఉమ్మడి ఏపీలో ఒకనాడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజెంట్ విభజిత ఏపీలో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. కాగా, రోజురోజుకూ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైపోతున్నది. తాజాగా ఏపీలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ హవా చూపింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం నియోజకవర్గంలోనూ ఫ్యాన్ ప్రభంజనం సృష్టించింది. టీడీపీ పరాజయాన్ని మూటకట్టుకుంది. కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకుగాను 74 చోట్ల వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.
ఇకపోతే కేవలం 14 చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. ఇక ఒకే ఒక చోట కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు విక్టరీ సాధించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం, కుప్పం జెడ్పీటీసీ స్థానాలను వైసీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుచుకున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో టీడీపీ పార్టీ కనిపించే పరిస్థితులు ఉండవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.