Ambati Rambabu : అంబటి గురించి బిగ్ న్యూస్ తెలిసి గుండె పట్టుకున్న జగన్
36 Cases Filed On Ambati Rambabu : ఏపీ రాజకీయాల్లో కల్తీ నెయ్యి వివాదం సెగలు రేపుతుండగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించే క్రమంలో జరిగిన ఘర్షణ, ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ శ్రేణులు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో, అంబటిపై ఏకంగా 36 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన గుంటూరు నల్లపాడు పీఎస్ పరిధిలో నమోదైన కేసులో అరెస్టయి, రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండటం వైసీపీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
Ambati Rambabu : అంబటి గురించి బిగ్ న్యూస్ తెలిసి గుండె పట్టుకున్న జగన్
అంబటిపై ఒకదాని తర్వాత ఒకటిగా నమోదవుతున్న కేసుల పరంపర వైసీపీ అధినేత జగన్ను షాక్కు గురిచేస్తోంది. ఒక కేసులో బెయిల్ వచ్చినా, మిగిలిన 35 కేసుల్లో పోలీసులు వరుసగా అరెస్ట్ చేసే (PT Warrant) అవకాశం ఉండటంతో అంబటి ఇప్పట్లో బయటకు రావడం కష్టమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనిని ‘రాజకీయ కక్షసాధింపు’గా వైసీపీ అభివర్ణిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే నేతపై ఇన్ని కేసులు నమోదు చేయడం ఓర్వలేనితనమేనని, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతను టార్గెట్ చేశారని వైసీపీ తన అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా ఆరోపిస్తోంది.
మరోవైపు, ఈ కేసుల నుంచి ఉపశమనం పొందేందుకు అంబటి రాంబాబు వర్గం హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, ప్రభుత్వం మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ముఖ్యమంత్రిని దూషించినందుకు బాధ్యత వహించక తప్పదని స్పష్టం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఒక మాజీ మంత్రిపై ఇన్ని కేసులు నమోదు కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలతో వైసీపీలో ఒకరకమైన ఆందోళన మొదలవ్వగా, రానున్న రోజుల్లో ఈ న్యాయపోరాటం ఎటు దారితీస్తుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది.